ఆంధ్రా, ఒడిశా సరిహద్దు(ఏఓబీ)లో మళ్లీ ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన భారీ ఎన్కౌంటర్ లో అగ్రనేతలతో పాటు 24 మంది మావోయిస్టులు అసువులు బాసి.. 24 గంటలు కూడా గడవకముందే మరోమారు ఏఓబీ ఎదురు కాల్పులతో దద్దరిల్లింది. మల్కన్ గిరలోని దట్టమైన అడవిలో కూంబింగ్ చేస్తున్న పోలీసులపైకి మావోలు కాల్పులు జరపడంతో పోలీసులు ప్రతిదాడులకు పాల్పడ్డారు.
పార్టీలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోలు మృతి చెందారు. వారిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. నిన్నటి ఎన్ కౌంటర్ లో ప్రాణాలతో తప్పటించుకన్న మావోయిస్టులే పోలీసులను లక్ష్యంగా చేసుకుని వారిపై కాల్పులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే తప్పించుకుని అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న మావోలను ప్రణాళిక బద్దంగా కూంబింగ్ చేస్తూ పోలీసులు వారిని మట్టుబెడుతున్నారు.
మావోయిస్టు పార్టీ తమకు పెట్టని కోటలైన అబూజ్మడ్తో పాటు ఏవోబీ లోని కొన్ని ప్రాంతాల్లో కమాండో శిక్షణా కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు గతంలోనే నిఘా వర్గాలు గుర్తించాయి. ప్రస్తుతం భారీ దాడులకు వ్యూహం పన్నుతున్న మావోయిస్టులు.. అందుకు తగ్గట్టుగానే భారీ సంఖ్యలో కేడర్కు కమాండో శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా సుమారు 50 మందికి ఎంపిక చేసి వారికి శిక్ష్ణనిస్తున్న శిబిరంపైనే పోలీసులు దాడులు చేయడంతో 24 మంది మృతి చెందగా పలువురు తప్పించుకున్నారని సమాచారం.
కాగా, పోలీసులకు మవోయిస్టులకు మద్య సాగుతున్న కాల్పలు దాడులు, ప్రతిదాడులతో అడవి తల్లి బిడ్డలు గజగజా వణుకుతున్నారు. ఏజెన్సీ గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న అందోళనతో వారు బిక్కబిక్కుమంటూ గడుపుతున్నారు. మావోలు తమపై అకారణంగా పలు చర్యలకు పాల్పడుతారేమోనన్న భయాందోళన వారిలో నెలకొంది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఎన్ కౌంటర్లతో ఏజెన్సీ గ్రామాలు బీతిల్లిపోతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more