మళ్లీ కాల్పులతో భీతిల్లిన ఏఓబీ.. మగ్గురు మావోల మృతి 3 Naxals gunned down in Odisha

3 maoists killed near ap odisha border

maoists, 3 maoists killed, maoist death encounter, maoist encounter, maoist encounter odisha border, maoist encounter andhra border

After entire dalam of 24 Maoists was killed in an encounter near Jantri in Koraput district on AP-Odisha border, in an onother incident police gunned down three more maoists on tuesday wee hours

మళ్లీ కాల్పులతో భీతిల్లిన ఏఓబీ.. మగ్గురు మావోల మృతి

Posted: 10/25/2016 09:26 AM IST
3 maoists killed near ap odisha border

ఆంధ్రా, ఒడిశా సరిహద్దు(ఏఓబీ)లో మళ్లీ ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్ లో అగ్రనేతలతో పాటు 24 మంది మావోయిస్టులు అసువులు బాసి.. 24 గంటలు కూడా గడవకముందే మరోమారు ఏఓబీ ఎదురు కాల్పులతో దద్దరిల్లింది. మల్కన్ గిరలోని దట్టమైన అడవిలో కూంబింగ్ చేస్తున్న పోలీసులపైకి మావోలు కాల్పులు జరపడంతో పోలీసులు ప్రతిదాడులకు పాల్పడ్డారు.

పార్టీలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోలు మృతి చెందారు. వారిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. నిన్నటి ఎన్ కౌంటర్ లో ప్రాణాలతో తప్పటించుకన్న మావోయిస్టులే పోలీసులను లక్ష్యంగా చేసుకుని వారిపై కాల్పులు జరుపుతున్నట్లు సమాచారం. అయితే తప్పించుకుని అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న మావోలను ప్రణాళిక బద్దంగా కూంబింగ్ చేస్తూ పోలీసులు వారిని మట్టుబెడుతున్నారు.

మావోయిస్టు పార్టీ తమకు పెట్టని కోటలైన అబూజ్‌మడ్‌తో పాటు ఏవోబీ లోని కొన్ని ప్రాంతాల్లో కమాండో శిక్షణా కేంద్రాలను నిర్వహిస్తున్నట్లు గతంలోనే నిఘా వర్గాలు గుర్తించాయి. ప్రస్తుతం భారీ దాడులకు వ్యూహం పన్నుతున్న మావోయిస్టులు.. అందుకు తగ్గట్టుగానే భారీ సంఖ్యలో కేడర్‌కు కమాండో శిక్షణ ఇస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా సుమారు 50 మందికి ఎంపిక చేసి వారికి శిక్ష్ణనిస్తున్న శిబిరంపైనే పోలీసులు దాడులు చేయడంతో 24 మంది మృతి చెందగా పలువురు తప్పించుకున్నారని సమాచారం.

కాగా, పోలీసులకు మవోయిస్టులకు మద్య సాగుతున్న కాల్పలు దాడులు, ప్రతిదాడులతో అడవి తల్లి బిడ్డలు గజగజా వణుకుతున్నారు. ఏజెన్సీ గ్రామాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న అందోళనతో వారు బిక్కబిక్కుమంటూ గడుపుతున్నారు. మావోలు తమపై అకారణంగా పలు చర్యలకు పాల్పడుతారేమోనన్న భయాందోళన వారిలో నెలకొంది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఎన్ కౌంటర్లతో ఏజెన్సీ గ్రామాలు బీతిల్లిపోతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maoists  encounter  andhra-odisha border  special police  

Other Articles