సమాజ్ వాదీ పార్టీలో ఏర్పడిన రాజకీయ అనిశ్చితిని ఓ వైపు సద్దుమణిగేందుకు చర్యలు తీసుకుంటున్న క్రమంలో పార్టీ అధినేత ములాయం సింగ్ సన్నిహితుడైన రాజ్యసభ సభ్యుడు, ఇటీవల పార్టీ నుంచి బహిష్కరణకు గురైన నేత రాంగోపాల్ యాదవ్ కుమారుడు, ఫిరోజాబాద్ ఎంపీ అక్షయ్ యాదవ్ లెటర్ బాంబు పేల్చారు. పార్టీలో నెలకొన్న పరిస్థితులపై ఇవాళ ఉదయమే లక్నోలో అధినేత ములాయం తన సోదరుడు శివసాల్ సింగ్ కు, కుమారుడు, అఖిలేష్ యాదవ్ కు మద్య ఏర్పడిన అగాధాన్ని తీర్చేందుకు ప్రయత్నించారు. ఆ తరువాత ఇరువురితో కలసి ని పార్టీ కార్యాలయంలో మీడియాతో కూడా మాట్లాడారు. ..
ఇలా సంక్షోభం సద్దుమణుగుతుందని భావించిన సమయంలో సీఎం అఖిలేశ్ యాదవ్ కు మద్దతుగా అక్షయ్ యాదవ్ లేఖాస్త్రం సంధించారు. పార్టీలో సంక్షోభానికి ముమ్మాటికి శివపాల్ యాదవ్ కారణమని ఆరోపించారు. అఖిలేశ్ వ్యతిరేకంగా శివపాల్ ఏవిధంగా కుట్ర సాగించారో తన లేఖలో వివరించారు. 2012లో అఖిలేశ్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకుని, తానే సీఎం కావాలని శివపాల్ అన్ని ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. అఖిలేశ్ ను దారుణంగా అవమానించారని, మానసికంగా హింసించారని ఆవేదన వ్యక్తం చేశారు. అఖిలేశ్ ను ఇంట్లోంచి బలవంతంగా గెంటివేయడంతో, ఆయన కొత్త ఇంటికి మారారని వెల్లడించారు. నాలుగున్నరేళ్లుగా ఆయనను అణచివేసేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు.
అఖిలేశ్ కు తన తండ్రి మద్దతు ప్రకటించడం ఆయన జీర్ణించుకోలేకపోయారన్నారు. బీజేపీకి దగ్గరయ్యారంటూ తన తండ్రిపై అసత్య ప్రచారం చేశారని వాపోయారు. అయితే శివపాల్ సింగే బీజేపీతో సంబంధాలు పెట్టుకున్నారని ఆరోపించారు. జూలైలో బీజేపీ ఎంపీతో కలిసి ఆ పార్టీకి చెందిన అగ్రనేతను శివపాల్ కలిశారని, తన దగ్గర ఆధారాలున్నాయన్నారు. శివపాల్ కుమారుడి వివాహ రిసెప్షన్ కు అయిన ఖర్చు అమర్ సింగ్, బీజేపీ ఎంపీ భరించారని వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more