మరికోన్ని నెలల వ్యవధిలో ఎన్నికలకు వెళ్లాల్సిన నేపథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ లోని సమాజ్ వాదీ పార్టీని మాత్రం ఇంకా సంక్షోభం వీడటం లేదు. పార్టీలో సంక్షోభానికి అమర్ సింగ్ కారణమంటూ ముఖ్యమంత్రి అఖిలేష్ సహా అతని వర్గం అరోపణలు గుప్పిస్తూన్న తరుణంలోనే మొత్తం ఇతివృత్తంపై ఎట్టకేలకు ఆయన మౌనం వీడారు. తనకు తన తండ్రికీ మధ్య ఎలాంటి విభేధాలు లేవని, అదే సమయంలో తాను నూతన పార్టీని స్థాపించనున్నట్లు వస్తున్న వార్తలను కూడా ఆయన ఖండించారు.
ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన అఖిలేష్ యాదవ్.. లక్నోలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. కంటతడి పెట్టారు. తన తండ్రి కోరితే తాను ముఖ్యమంత్రి పదవికి కూడా రాజీనామా చేయడానికి సిద్దమేనని ప్రకటించారు. తాను ముఖ్యమంత్రి కాదని ఎస్సీ సీనియర్ నేత అమర్ సింగ్ గత నవంబర్ లో చేసిన వ్యాఖ్యాలు తనను బాధించాయని చెప్పారు. రాంగోపాల్ యాదవ్ వ్యాఖ్యలు చేయకపోయినా అతనిపై చర్యలు తీసుకున్నారని వాపోయారు.
పార్టీ సమావేశంలో శివపాల్ యాదవ్ ప్రసంగించేందుకు లేవగానే అఖిలేశ్ వర్గీయులు నిరసన వ్యక్తం చేశారు. సమావేశానికి హాజరైన ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్, అయన సోదరుడు శివపాల్ సింగ్ యాదవ్, తనయుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ల మద్దతుదారుల మధ్య కొట్లాట జరిగింది. ఒకరినిమించి ఒకరు నినాదాలు చేసిన ఇరువర్గాల ఘర్షనాత్మక వాతావరణాకి దిగాయి. తోపులాటకు కూడా కార్యకర్తలు దిగారు. దీంతో భద్రతా దళాలు, పోలీసులు కార్యకర్తలను చెదరగొట్టి పరిస్ధితిని అదుపులోకి తీసుకువచ్చారు.
దీంతో అఖిలేశ్ జోక్యం చేసుకుని.. 'ఇక్కడ చాలా మంది అయోమయాన్ని సృష్టిస్తున్నారు. ముందుగా ములాయం, శివపాల్ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వండి. ప్రతి ఒక్కరూ ములాయం బాటలో నడుస్తున్నాం.. ఆ మార్గంలో వీలైనన్ని విజయాలు సాధించాను. అన్యాయాన్ని ఎదుర్కొమని నా తండ్రి నాకు బోధించారు. ఆయన ఆదేశాలను శిరసావహించాను. పార్టీలో జరిగిన కుట్రపై తప్పకుండా విచారణ జరిపిస్తానన్నారు. కాగా పార్టీ అధినేత నేతాజీ (ములాయం) మనసులో ఏముందో తెలుసుకోవాలని కార్యకర్తలు కోరుకుంటున్నార'ని అఖిలేశ్ యాదవ్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more