ఏపీలో మరో కీచక ఖాకీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మహిళలకు రక్షణగా నిలవాల్సిన ఓ కానిస్టేబుల్ వారి ఏకాంతాన్ని ఆసరాగా తీసుకుని బ్లాక్ మెయిలింగ్ పాల్పడ్డాడు. అంతేకాదు డబ్బుతోపాటు తన కోరిక తీర్చాలంటూ వారిపై ఒత్తిడి తేసాగాడు. అతని ఆగడాలు మరీ శృతి మించిపోవటంతో ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతగాడి వ్యవహారం వెలుగులోకి చూసింది.
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటకు చెందిన గోపీ అనే వ్యక్తి బాలాజీనగర్ పోలీస్స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. గత కొంతకాలంగా బుద్ధి పక్కదారి పట్టి పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో ఒంటరిగా ఉన్న ప్రేమజంటలను టార్గెట్ చేస్తున్నాడు. వారి ఫొటోలను తీసి డబ్బు కోసం బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతూ, అమ్మాయి నచ్చితే వారిపై అఘాయిత్యాలకు కూడా పాల్పడుతున్నాడు. ఓ యువతి ధైర్యం చేసి ఎస్పీకి ఫిర్యాదు చేయటంతో అతని కిరాతకం బయటపడింది. అక్టోబర్ 20వ తేదీ రాత్రి ఇద్దరు మెడికో విద్యార్థులు ఎస్వీజీఎస్ కళాశాల సమీపంలోని పద్మావతి లేఅవుట్ వద్ద కారులో ఏకాంతాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. విషయాన్ని గమనించిన గోపీ వారి వద్దకు వెళ్లి ఫొటోలు తీశారు.
బెంబేలెత్తిన విద్యార్థులు అక్కడి నుంచి కారును ఆన్చేసి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండగా గోపీ అడ్డుకున్నారు. స్టేషన్కు పదండంటూ వారిని బెదిరించి వివరాలను సేకరించారు. తాను అడిగినంత ఇస్తే పోలీస్స్టేషన్కు తీసుకెళ్లనని చెప్పారు. గోపీ చేష్టలకు బెదిరిపోయిన విద్యార్థులు తమ వద్ద ఉన్న కొంత నగదును కానిస్టేబుల్కు ఇవ్వడంతో అక్కడి నుంచి ఆయన వెళ్లిపోయాడు. తర్వాత మరోసారి ఆ కానిస్టేబుల్.. మెడికో విద్యార్థినికి ఫోన్ చేసి అధికమొత్తంలో నగదు డిమాండ్ చేశారు. లేదంటే ఫొటోలను తల్లిదండ్రులకు పంపుతానని బెదిరించాడు.
అంతటితో ఆగకుండా నువ్వు అందంగా ఉన్నావంటూ తన కోర్కె తీర్చాలని గోపీ యువతిపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. తనను వదిలేయమని ప్రాధేయపడినా పట్టించుకోలేదు. వేధింపులను తాళలేని విద్యార్థిని జరిగిన విషయాన్ని, కానిస్టేబుల్తో మాట్లాడిన సంభాషణ ఆడియోను ఎస్పీ విశాల్గున్నీకి మెసేజ్ చేశారు. కానిస్టేబుల్ బారినుంచి తనకు రక్షణ కల్పించాలని అభ్యర్థించారు. స్పందించిన ఎస్పీ వెంటనే విచారించి కానిస్టేబుల్పై క్రిమినల్ కేసు నమోదు చేసి నివేదికను సమర్పించాల్సిందిగా బాలాజీనగర్ పోలీసులను ఆదేశించారు.
పూర్తి స్థాయి విచారణ అనంతరం బాలాజీనగర్ ఇన్స్పెక్టర్ రామారావు పూర్తిస్థాయిలో విచారించి కానిస్టేబుల్ గోపీపై శనివారం రాత్రి క్రిమినల్ కేసు నమోదు చేశారు. అతడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సదరు కానిస్టేబుల్ను విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు తెలిసింది. ఇంకా అతని బారిన ఎంత మంది పడ్డారోననే కోణంలో విచారణను వేగవంతం చేశారు. కాగా, గోపీపై క్రిమినల్ కేసు నమోదు విషయాన్ని బాలాజీనగర్ పోలీసులు గోప్యంగా ఉంచారు. అయినప్పటికీ విషయం బయటికి పొక్కటంతో ఇప్పుడు వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more