ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులకు భారీ దెబ్బ పడింది. మల్కాన్ గిరి జిల్లాకు 10 కి.మీ. దూరంలో ఏవోబీ ప్రాంత సమీపంలో సోమవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఇందులో 23 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. మావోయిస్టుల కీలక సమావేశాలు జరుగుతున్నట్లు సమాచారంతో ఏపీ-ఒడిశా గ్రేహౌండ్ పోలీసు బలగాలు సంయుక్తంగా నిన్నటి నుంచి కూంబింగ్ చేపట్టింది. ఆయా ప్రాంతాల్లో అణువణువునా జల్లెడ పట్టాయి.
ప్లీనరీ సమావేశం కోసం సుమారు 50 నుంచి 60 మంది మావోలు ఓ చోట గుమిగూడిన విషయం తెలుసుకుని అక్కడికి చేరేందుకు ప్రయత్నించాయి. అయితే పోలీసులపై మావోయిస్టులు కాల్పులు జరపటంతో ప్రతిగా పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. వీరిలో 8 మంది మహిళా మావోలు కూడా ఉన్నట్లు సమాచారం.
ఏవోబీ అగ్రనేత ఉదయ్ మృతి చెందినట్లు నిర్థారణ అయ్యింది. కిరణ్, సుధాకర్ లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ కుమారుడు మున్నా కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ ఘటనలో 15మంది మావోయిస్టులు కూడా ఉదయ్ దళానికి చెందిన వారే అని తెలుస్తోంది. ఘటనా స్థలంలో నాలుగు ఏకే-47లతో సహా భారీ పెద్దన పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
మృతుల్లో మరికొందరు కీలక నేతలు ఉన్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కీలక నేత గాజర్ల అశోక్ అలియాస్ గణేశ్ సహా తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. మృతదేహాలను గుర్తించేందుకు మాజీ మావోల సహకారం తీసుకుంటున్నారు. మరోవైపు ఇద్దరు గ్రేహౌండ్స్ పోలీసు కానిస్టేబుల్స్ కూడా తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం హెలికాప్టర్ ద్వారా విశాఖకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కూబింగ్ మరింత ఉధృతం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more