స్వదేశీ విమాన ప్రయాణికులకు శుభవార్త. సామాన్య ప్రజలకు విమాన ప్రయాణం అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు మోదీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న 'ఉడే దేస్ కా ఆమ్ నాగరిక్' (ఉడాన్) పథకం ప్రారంభమైంది. ఈ పథకం కింద చిన్న పట్టణాలకు అనుసంధానించే గంటలోపు విమాన ప్రయాణాలకు రూ.2,500 మాత్రమే వసూలు చేయనున్నారు. ఈ పథకంలోని మొదటి విమానం జనవరిలో టేకాఫ్ తీసుకోనుంది. ఈ పథకం కింద గంటలోపు ప్రయాణానికి కేవలం రూ. 2,500 మాత్రమే వసూలు చేయనున్నారు.
వినియోగదారుల ధరల సూచికి అనుగుణంగా విమాన టికెట్ల ధరలను కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటారు. ప్రధాన రూట్లలో ప్రతి డిపార్చర్ మీద చిన్నమొత్తంలో లెవీ విధించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని మాత్రం విమానయాన సంస్థలు అంత తేలిగ్గా జీర్ణించుకునే పరిస్థితి లేదు. దానివల్ల విమానచార్జీలు పెంచాల్సి ఉంటుందని అంటున్నాయి. అయితే లెవీ ఎంత అన్నది ఇంకా నిర్ణయించలేదు. రాబోయే రోజుల్లో దీన్ని నిర్ణయిస్తారు. అయితే దీని భారం ప్రతీ టిక్కెట్లుపై సుమారుగా అరవై నుంచి వంద రూపాయల వరకు వుండవచ్చని అంచనా.
ప్రపంచంలోనే ఇలాంటి పథకం ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. విమానంలో కనీసం సగం సీట్లకు బిడ్డింగ్ వేయడంతో పాటు మిగిలిన వాటి ధరలు మార్కెట్ ఆధారంగా ఉండాలన్నది ఈ పథకం ఉద్దేశం. త్వరలోనే హెలికాప్టర్ సేవలు కూడా ఈ పథకం పరిధిలోకి వస్తాయి. ఈ పథకంలోని మొదటి విమానం జనవరిలో టేకాఫ్ తీసుకుంటుందని అంటున్నారు.ఈ పథకం గురించి చాలా జాగ్రత్తగా అన్నీ గమనిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు చెప్పారు. ఇప్పటివరకు విమానాలు అసలు నడపని లేదా తక్కువగా నడుపుతున్న నగరాలకు కూడా విమానాలు పంపాలన్నది తమ ఉద్దేశమన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more