ఏపీలో ఓవైపు కరువు విలయ తాండవం చేస్తుంటే... రెయిన్గన్లతో పంటలు పండించామని చెప్పుకుంటున్న మాటలు నిజమా? అని వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతు సమస్యలపై మంగళవారం అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆయన ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ సీఎం చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశాడు. ‘నిజంగా నాకు ఆశ్చర్యమనిపించింది... ఓవైపు రాష్ట్రంలో కరవు పరిస్థితితో రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే మీకు కరవు పరిస్థితే తెలియదన్నారు.
కంప్యూటర్ ద్వారా ప్రపంచంలోని అన్ని విషయాలు తెలుస్తాయని ఓ పక్క చెబుతుంటారు. మరోపక్క కరవు పరిస్థితి తెలియలేదు అంటున్నారు. ఏం కంప్యూటర్ల ద్వారా పరిస్థితి తెలుసుకోలేరా అని ప్రశ్నించాడు. ఇది చాలదన్నట్లు మళ్లీ రెండు రోజుల్లో మీటింగ్ పెట్టి కరవుపై యుద్ధం చేసి గెలిచేశామని చెప్పుకున్నారు’ అని పేర్కొన్నాడు.
‘రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వర్షపాతం తక్కువగా నమోదయింది.... ఈరోజు నేను ఒక్కటి ప్రశ్నించానుకుంటున్నా.. కరవు రావడమన్నది ఎవరి చేతుల్లోనూ ఉండదు కానీ, వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఎలా స్పందించాలన్న విషయం మీకు తెలియదా? రైతులకు న్యాయం చేసే స్థితిలో ఎందుకు లేరు?. రైతుల ఆత్మహత్యలు తగ్గించడానికి ఆనాడు వైఎస్ రాజశేఖర్రెడ్డి ఉచిత విద్యుత్ పై మొదటి సంతకం పెట్టారు. ఆ సంతకంతో వ్యవసాయంపై ఆధారపడుతున్న రైతులు ఎంతో సంతోషించారు.
అంతకు ముందు తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో రైతులకు చంద్రబాబు పోలీస్స్టేషన్లలో పెట్టించారు. ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యలపై వైఎస్ ఢిల్లీలో హై కమాండ్పై ఒత్తిడి తీసుకొచ్చి వారి కష్టాలను తీర్చారు. మరీ చంద్రబాబు ఇప్పుడు రైతుల కోసం ఏం చేస్తున్నారు? అని జగన్ వ్యాఖ్యానించారు.
‘రాష్ట్రంలోని 250 మండలాల్లో కరవు తాండవిస్తోంది. ఎన్నికల ప్రచారసభల్లో రైతులకు న్యాయం చేస్తానని చెప్పారు.. ఇప్పుడు వారి కష్టాలను పట్టించుకునే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వకుండా రైతుల నోట్లో మట్టి కొట్టారు. మాధవరంలో చంద్రబాబు ఏ పొలంలోనయితే రెయిన్గన్స్ ప్రారంభించారో ఆ పొలమే ఇప్పుడు ఎండిపోయి కనిపిస్తోంది.. ఇన్పుట్ సబ్సిడీలో ఒక్క రూపాయి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. పంట బీమా కూడా దక్కని పరిస్థితి రాష్ట్రంలో ఉంది’ అని జగన్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more