ఓవైపు పాక్(ఉగ్రవాదుల) పై మెరుపు దాడి చేసిన మోదీ సర్కార్ ను దేశంలోని నేతలంతా అభినందిస్తున్నారు. మోదీ సర్కార్ కి తామంతా మద్ధతుగా నిలుస్తామంటూ గురువారం అఖిలపక్ష భేటీ అనంతరం జాతీయ నేతలంతా ప్రకటించడం చూశాం. అందులో ప్రతిపక్ష పార్టీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కూడా ఉన్నారు. దేశమంతా ముక్తకంఠంతో మోదీకి సపోర్ట్ వస్తున్న వేళ కాంగ్ యువరాజు ఏం మాట్లాడతాడా అని అంతా ఎదురు చూస్తుండగా.. స్పందించేశాడు.
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ‘దియోరియా టూ ఢిల్లీ యాత్ర’ పేరిట 2,500 కిలో మీటర్ల కిసాన్ పాదయాత్రను కొనసాగిస్తున్న రాహుల్ ఈ విషయంపై స్పందించాడు. ‘మోదీకి థ్యాంక్స్. ఎందుకంటే.. రెండున్నరేళ్ల క్రితం భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ చేసిన తొలి మంచి పని ఇదే’ అని ఆయన వ్యాఖ్యానించారు. అర్జంట్ గా ఆయనతో మాట్లాడాలని ఉంది. అభినందించాలని ఉంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు.
తాను, తమ పార్టీ(కాంగ్) పాక్పై కేంద్రం తీసుకున్న చర్యకు మద్దతిస్తుందని, దేశం మొత్తం ఆయన వెనకే ఉంటుందని పేర్కొన్నారు. సుదీర్ఘ పాదయాత్రలో భాగంగా పలుచోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తూ మోదీపై ఎక్కేస్తున్న రాహుల్.. ఈరోజు మాత్రం భిన్నంగా మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు వ్యాఖ్యానించటంతో అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు దేశ మాజీ ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు అటల్ బిహారి వాజ్ పేయి నాడు చేయలేని పనిని, ప్రధాని నరేంద్ర మోదీ తన హయాంలో చేసి చూపించాడని సోషల్ మీడియాలో అభినందనలు వెలువెత్తుతున్నాయి. 2001లో వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో పాక్ ఉగ్రవాదులు మన దేశంలో పలు చోట్ల దాడులకు పాల్పడ్డారు. ఏకంగా, మన దేశ పార్లమెంట్ పైనే దాడికి పాల్పడ్డారు. అయితే, ఈ దాడి అనంతరం వాజ్ పేయి ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించలేదని పలు విమర్శలు వచ్చాయి.
ఇక ఇప్పుడు ప్రస్తుత విషయానికొస్తే, యూరీ సెక్టార్ ఘటన, కాల్పుల విరమణ నిబంధనలను పాక్ ఉల్లంఘించడం వంటి కవ్వింపు చర్యలు చోటు చేసుకున్నాయి. ఇప్పటిదాకా వ్యూహాత్మక సహనం పాటించిన భారత్, పారికర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ దల్బీర్ సింగ్ పర్యవేక్షణలో జరిగిన దాడిలో ఉగ్రవాద శిబిరాలపై విరుచుకుపడి, ఉగ్రవాదులను భారత్ సైన్యం మట్టుబెట్టడం తెలిసిన విషయమే. అయితే అదే సమయంలో వాజపేయి హయాంలోనే పోఖ్రాన్ పరీక్షలు నిర్వహించడం, కార్గిల్ యుద్ధంలో విజయం సాధించిన విషయాన్ని మరవకూడదని మరికొంతమంది అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more