మాటు వేసి మన సైన్యాన్ని పాక్ ఉగ్ర రాక్షసులను భారత్ పంజా పవర్ చూపి సత్తా చాటింది సైన్యం. ఈ క్రమంలో సర్జికల్ స్ట్రైక్స్ (సునిశిత దాడులు) గతంలో జరిగిన వాటిని గుర్తు చేసుకుంటున్నారు మన మాజీ సైనికాధికారులు. చుట్టుపక్కల నష్టం వాటిల్ల కుండా కేవలం లక్ష్యం మాత్రమే నాశనం అయి అయ్యేలా అదే సమయంలో దాడి చేసే వాళ్లకి కూడా డ్యామేజ్ కాకుండా చేయటమే సర్జికల్ స్ట్రైక్స్ ఉద్దేశమన్నది తెలిసిందే.
ఈ సందర్భంగా చరిత్ర సృష్టించిన కొన్ని సర్జికల్ స్ట్రైక్స్ వివరాల్లోకి వెళ్తే...
-1976 జూన్ లో ఉగాండాకు చెందిన హైజాకర్లు ఓ విమానాన్ని హైజాక్ చేసి అందులో పాలస్తీనీయులు, ఇజ్రాయేలీలను బందీలుగా పట్టుకున్నారు. వారిని యూదులు, యూదేతరులుగా రెండు వర్గాలుగా విభజించి, ఇజ్రాయెల్ తో బేరసారాలకు దిగారు. నాలుగు రోజుల చర్చ అనంతరం ఐదోరోజు ప్రణాళికలు రచించిన ఇజ్రాయెల్ కమెండోస్ ఆరోరోజు యుద్ధ హెలికాప్టర్ లో ఉగాండాకు వెళ్లి, హైజాకర్లు, నియంత సైన్యాన్ని మట్టుబెట్టి, బందీలుగా ఉన్నవారిని విడిపించి తమ విమానంలో ఎక్కించుకుని వెనుదిరిగారు. కేవలం 100 మంది కమాండోలు మాత్రమే పాల్గొన్న ఇదే ప్రపంచంలో అత్యుత్తమ సర్జికల్ స్ట్రైక్!
-ఇదే తరహాలో సర్జికల్ స్ట్రయిక్స్ ఇజ్రాయెల్ కొన్ని వందలు చేసి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఆ తరువాత 1977 అక్టోబర్ 13న మరో విమానాన్ని హైజాక్ చేసిన దుండగులు మొగదిషులో విమానాన్ని దించి బేరసారాలకు దిగినప్పుడు జర్మన్ సేనలు క్షణాల్లో దిగి, వారిని మట్టుబెట్టి బందీలను విడిపించడం ప్రపంచంలో రెండో అత్యుత్తమ సర్జికల్ స్ట్రైక్.
-కాగా, ప్రపంచంలో మూడో అత్యుత్తమ సర్జికల్ స్ట్రైక్, మే 2, 2011 ఒసామా బిన్ లాడెన్ లేపేయటం కోసం. పాకిస్థాన్ ఆర్మీ స్థావరానికి కూత వేటు దూరంలో ఉన్న అబోటాబాద్ లో అమెరికా సేనలు హతమార్చి శవాన్ని తీసుకెళ్లి సముద్రంలో పడెయ్యడం ద్వారా సాధించిన విజయం.
-ఇక ఇప్పుడు ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ దళాలు సంయుక్తంగా చేపట్టిన సర్జికల్ స్ట్రయిక్ విజయవంతం కావడంతో 38 మంది పాక్ ఉగ్రవాదులను, వారికి సహకరించిన 2 పాక్ సైనికులను మట్టుబెట్టడంతో, చరిత్రలో నిలిచిపోయేలా నాలుగో సర్జికల్ స్ట్రైక్ భారత్ ఖాతాలో పడిందని మాజీ సైనికాధికారులు చెప్పుకుంటున్నారు.
ఇక మయన్మార్ అటవీ ప్రాంతంలో గతేడాది జూన్ లో భారత్ 70 మంది ఆర్మీ కమాండోస్ తో నిర్వహించిన 40 నిమిషాల సర్జికల్ స్ట్రైక్ లో 38 మంది నాగా మిలిటెంట్లను మట్టికరిపించింది. అంతకు ముందు వారు మన సైన్యంలోని 18 మంది సైనికులను పొట్టనబెట్టుకోవటంతో సైన్యం ఈ ప్రతీకార చర్యకు దిగింది. ఇక బే ఆఫ్ పిగ్స్ ఇన్వెషన్ పేరుతో 1961లో జరిగిన సర్జికల్ స్ట్రైక్ మరోకటి. ధి బే ఆప్ పిగ్స్ దీవుల నుంచి తమ దేశంలోకి అక్రమ చొరబాటుదారులను నివారించే క్రమంలో అమెరికా సాయంతో క్యూబా నిర్వహించిన ఈ దాడిలో ఫెడల్ కాస్ట్రో ప్రభుత్వం ఘోర నష్టాన్ని చవిచూసింది. 100 మంది పైగా సైనికులు చనిపోగా, 1200 మంది శరణార్థులను ప్రాణాలతో పట్టుకొగలిగారు.
1979 నవంబర్ లో ఇరాన్ ఆపరేషన్ ఈగల్ క్లా, కూడా విషాదంగానే మిగలగా, సోమాలియాలో 1993లో నిర్వహించిన బ్లాక్ హాక్ డాన్ కూడా అదే తీవ్ర నష్టాన్నే మిగిల్చాయి. ఇక ఆపరేషన్ నిఫ్టీ ప్యాకేజీ పేరిట పనామా నిర్వహించిన ఓ ఆపరేషన్ కామెడీగా ముగిసింది. 1989లో యూఎస్ భద్రతా దళాలు పనామా నియంత మాన్యుఎల్ నోరిగా ను పట్టుకునేందుకు ఈ ఆపరేషన్ నిర్వహించారు. పనామా సిటీలోనే యూఎస్ దళాలకు, పనామా సైన్యానికి భీకర పోరు జరగ్గా, ఆ శబ్ధాలను తట్టుకోలేక నోరిగా లోంగిపోయాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more