షారూఖ్ ఖాన్ సినిమా మై నేమ్ ఈజ్ ఖాన్ గుర్తుందా? అందులో ముస్లిం అయినందుకు షారూఖ్ ను టెర్రరిస్ట్ గా అనుమానించి అవమానిస్తుంటారు అమెరికా పోలీసులు. ఆ క్రమంలో అతని కొడుకు కోల్పోయి, భార్యను దూరం చేసుకుని, చివరకు ఒబామాను కలిసి మై నేమ్ ఈజ్ ఖాన్ ఐ యామ్ నాట్ ఏ టెర్రరిస్ట్ అని చెబుతుంటాడు. సరిగ్గా ఇప్పుడు అలాంటి సంఘటనే ఇప్పుడు ముంబైలో నిజంగా చోటుచేసుకుంది. సోషల్ మీడియా వాట్సాప్లో కొందరు అప్లోడ్ చేసిన ఫొటో ఓ కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టింది.
ముంబైకి చెందిన షేర్ అలీఖాన్(30) డ్రైవర్. విరార్ ప్రాంతంలో భార్య, పిల్లలతో కలిసి జీవిస్తున్నాడు. ఈ నెల 22న అతడు తన బైక్పై బయటకు వెళ్లినప్పుడు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతడి ఫొటో తీసి ‘టెర్రరిస్ట్’ అని రాసి వాట్సాప్లో అప్లోడ్ చేశారు. ఇది చూసిన బంధువుల నుంచి తెలిసిన వారి వరకు అందరూ అలీకి ఫోన్ చేసి ‘నువ్వు టెర్రరిస్టువా’ అని ఆరా తీయడం మొదలుపెట్టారు. అందరూ అదే పనిగా ఆ ప్రశ్నే అడుగుతుండడంతో భయంతో ఏం చేయాలో పాలుపోని అలీ ఇంటికే పరిమితమయ్యారు. బయటకు వస్తే దాడి చేసే అవకాశం ఉందన్న భయంతో ఐదు రోజులపాటు ఇంట్లోనే గడిపిన ఆ కుటుంబం ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని వేడుకుంది.
చివరికి ధైర్యం తెచ్చుకున్న అలీ ‘నాపేరు ఖాన్.. నేను ఉగ్రవాది కాను’ అనే ప్లకార్లు చేతబట్టి భార్య పిల్లలతో సహా పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు తన ఫొటోను తీసి ఉగ్రవాది అంటూ వాట్సాప్లో పెట్టారని ఫిర్యాదు చేశాడు. దీంతో తన కుటుంబం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని, దాడి చేస్తారన్న భయంతో క్షణమొక యుగంగా గడుపుతున్నామని పేర్కొన్నాడు. తానుంటున్న అపార్ట్మెంట్ను ఖాళీ చేయాలని కొందరు తనను బెదిరిస్తున్నారని, ఇది వారి పనే అయి ఉండొచ్చంటూ ఏడుగురిపై ఫిర్యాదు చేశాడు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని తనను, తన కుటుంబాన్ని రక్షించాలని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more