చిన్న పొరపాటు ఓ వ్యక్తిని 43 ఏళ్లుగా వీల్ చైర్ కే అంకితం చేసి పడేసింది. అలాగని ఓ యాక్సిండెంటో దానికి కారణం అనుకుంటే పప్పులో కాలేసినట్లే... అసలు ఏం జరిగిందంటే... పోర్చుగీస్కి చెందిన రుఫినో బొర్రె 13 ఏళ్ల వయసుల్లో తీవ్ర అనారోగ్యంతో బాధపడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని ఆస్పత్రిలో చేర్పించగా, పరిక్షించిన వైద్యులు రుఫినోకి మస్కులర్ డిస్ట్రోఫీ(కండరాలు చచ్చుపడిపోయాయి) అనే వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. దాని ప్రకారం రుఫినో జీవితాంతం వీల్ చైర్ కే అంకితం కావాలని తేల్చేశారు.
రుఫినో ఇక నడవలేడని తెలియటంతో అతని తల్లిదండ్రులు వీల్ చైర్ లోనే అతన్ని 43 ఏళ్లుగా ఉంచి, సేవలు చేస్తూ వస్తున్నారు. అయితే, 2010లో ఓ ప్రముఖ న్యూరాలజిస్ట్ రుఫినోకి 43 ఏళ్ల క్రితం వైద్యులు ఇచ్చిన రిపోర్టులు చూశాడు. అనుమానం వచ్చిన వైద్యుడు రుఫినోకి మళ్లీ ఓసారి పరీక్షలు నిర్వహించాడు. అందులో రుఫినోకి మైస్తేనియాగా(కండరాల బలహీనత)తో మాత్రమే బాధపడుతున్నాడని తేల్చేశాడు. అసలు అతనికి మస్కులర్ డిస్ట్రోపీ అనే వ్యాధితో కాదని, ప్రస్తుతం ఉన్న వ్యాధికి చికిత్స కూడా చేయించొచ్చని వివరించాడు.
దీంతో తన వ్యాధికి చికిత్స తీసుకున్న తరువాత రుఫినో నేలపై కాళ్లు పెట్టి మెల్లిగా నడక నేర్చుకున్నాడు. సంవత్సరానికి రెండు సార్లు వైద్యుడి వద్దకు వెళ్లి సూచనలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం రుఫినో పూర్తిగా కోలుకున్నాడు. మామూలుగా నడుస్తూ అన్ని పనులు చేసుకుంటున్నాడు. ఇక్కడో హైలెట్ ట్విస్ట్ కూడా ఉందండోయ్... 1960లో వైద్యులు చెప్పినట్లు మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధి వైద్యశాస్త్రంలోనే లేదట. మొత్తానికి నాలుగు దశాబ్దాల తర్వాత నడక నేర్చుకుని (56 వయసులో) తిరిగి మాములు జీవితం ఆరంభించిన రుఫినో, తనను వీల్చైర్ కే పరిమితం చేయాలని చూసిన ఆసుపత్రిపై త్వరలో కేసు పెట్టబోతున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more