బీహార్ లో జింగిల్ రాజ్యం ఎలా ఉంటుందంటే... అక్కడి నేతలకు, క్రిమినల్స్ తో ప్రత్యక్షంగా లింకులుంటాయి. సంచలనం సష్టించిన శివాన్ జర్నలిస్ట్ రంజన్ హత్య కేసులో పరారీలో వున్న నిందితుడు జావెద్ భట్తో ఆర్జేడీ చీఫ్ లాలూ కొడుకు, ఆరోగ్య శాఖా మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్లు ఫోటో దిగి తీవ్ర విమర్శలు ఎదుర్కున్న సంగతి తెలిసిందే. ఇక ఆ విషయంలో తానేం తక్కువ కాదు అంటున్నాడు లాలూ. అదే నిందితుడితో లాలూ దిగిన ఫోటో ఒకటి ఇప్పుడు నెట్లో సంచలనంగా మారింది.
ఓ వేదికపై కూర్చున్న లాలుతో జావేద్ మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హత్య కేసులో నిందితుడితో తండ్రీకొడుకులు సన్నిహితంగా ఉన్న ఫొటోలు బయటకు రావడంతో వారిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఆర్జేడీ నాయకులు నేరగాళ్లను ప్రోత్సహిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కాగా లాలుతో జావేద్ కలిసున్న ఫొటో పాతదని భావిస్తున్నారు. మంత్రి తేజ్ ప్రతాప్తో మాత్రం జావేద్ ఇటీవల కలిశాడు.
ఇక, రంజన్ హత్య కేసులో మరో నిందితుడు కైఫ్తో కలసి జావేద్ మంత్రితో కలిసున్న ఫొటోపై మంత్రి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. రంజన్ హత్య కేసును సరిగా దర్యాప్తు చేయడం లేదని, సీబీఐతో విచారణ చేయించాలని కోరుతూ ఆయన భార్య ఆశ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఓ వైపు సీబీఐ నాయకులు ఈ కేసును విచారిస్తుండగా.. లాలు, ఆయన తనయుడుతో నిందితులు కలిసున్న ఫొటోలు బయటకు రావడంతో ఆర్జేడీ నాయకులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఇక రంజన్ హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ బృందం ఇటీవల భట్ నివాసంలో సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కేసులో భట్, మరో నిందితుడు జిమ్మి పరారీలో ఉన్నారు. మరో ఇద్దరు నిందితులు కైఫ్, సోను కోర్టులో లొంగిపోయారు. కైఫ్తో తేజ్ ప్రతాప్ యాదవ్ కలిసి వున్న ఫొటో వెలుగులోకిరాగా, దానిపై అత్యున్నత న్యాయస్థానం ఇటీవల లాలూ తనయుడికి నోటీసులు జారీ చేసింది. రంజన్ హత్య కేసు నిందితులకు రక్షణ కల్పించిన మీపై ఎఫ్ఐఆర్ ఎందుకు దాఖలు చేయకూడదో సమాధానం ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు తేజ్ ప్రతాప్ యాదవ్, షాబుద్దీన్లను ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more