జమ్ముకశ్మీర్లో రావణకాష్టంలా రగులుతున్న హింసాత్మక పరిస్థితులపై అందుకు కారణమైన దాయాధి పాకిస్తాన్ వైఖరిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేశారు. పాక్ వ్యవహరిస్తున్న తీరు తనతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం 'మన్ కీ బాత్'లో భాగంగా ఆల్ ఇండియా రేడియో మాధ్యమంగా మోదీ ప్రసంగించారు. యూరీలోని ఆర్మీ బేస్ పై దాడి చేసి 18 మందిని పొట్టన పెట్టుకున్న ఘటన భారతీయులను కలచి వేసిందని అన్నారు.
వీర మరణం పొందిన వారికి వందనం చేస్తున్నానని, పదే పదే పాకిస్థాన్ చేస్తున్న తప్పులకు సమాధానం చెప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పాకిస్థాన్ ను ఏకాకిని చేస్తామని చెప్పారు. భారత సైన్యం మాట్లాడదు. తానేం చేయగలదో చేసి చూపుతుంది. కాశ్మీరు లోయలోని ప్రజలకు ఎవరు జాతి వ్యతిరేకులన్న సంగతి తెలుస్తోంది. శాంతి, ఐకమత్యమే భారత విజయానికి కారణం. మన సమస్యలకు పరిష్కారం కూడా అదొక్కటే. దేశంలోని ప్రజలందరి బాధ్యతా కేంద్ర ప్రభుత్వానిదే. ప్రభుత్వం తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తుంది" అని వ్యాఖ్యానించారు.
యూరీ దాడి ఘటనను గుర్తు చేసుకున్న ఆయన, ఈ వెన్నుపోటు ఘటనతో భరతజాతి అగ్గిమీద గుగ్గిలమైందని అన్న ఆయన, ఈ తరహా ఘటనలు జరుగకుండా సైన్యం గట్టి చర్యలు తీసుకుంటుందనే భావిస్తున్నట్టు తెలిపారు. పారా ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన దివ్యాంగులు దేశంలోని క్రీడాకారుల్లో ఎంతో స్ఫూర్తిని నింపారని మోదీ కొనియాడారు. రియో పతకంతో దీప, జజారియాలు భారత కీర్తిని దశదిశలా వ్యాపించేలా చేశారని అన్నారు. అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత ఆటగాళ్లు మరింతగా రాణించాల్సి వుందని, ఆ దిశగా తానేం చేయాలో తనకు తెలుసునని అన్నారు.
స్వచ్ఛ భారత్ ప్రారంభించి రెండు సంవత్సరాలు అయిందని, ఈ రెండేళ్ల కాలంలో పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో ఎంతో అవగాహన పెరిగిందని మోదీ వివరించారు. నగరాలు, పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ శుభ్రమైన రహదారులు కనిపించడం మొదలైందని, ఇది తన ఒక్కడి కృషి కాదని, దేశ ప్రజలంతా తన ఆలోచనను పాటిస్తున్నారని తెలిపారు. స్వచ్ఛ భారత్ ను ప్రజల్లోకి చేర్చేందుకు ప్రసార మాధ్యమాలు కూడా కష్టించాయని అన్నారు. వచ్చే సంవత్సరం వ్యవధిలో దేశవ్యాప్తంగా కోటిన్నర మరుగుదొడ్లు నిర్మించనున్నామని తెలిపారు. మరుగుదొడ్డి లేని పాఠశాల కనిపించకుండా చేస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కేరళ రాష్ట్రాలు టాయ్ లెట్స్ విషయంలో మిగతా రాష్ట్రాల కన్నా చక్కగా పనిచేస్తున్నాయని కితాబిచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more