నయీం క్రైం గ్యారేజ్ లో వెలుగు చూస్తున్న పచ్చి నిజాలు రాను రాను పెరిగిపోతున్నాయి. బాధితులు ఒక్కోక్కరుగా బయటికి రావటం, వారు వెల్లడిస్తున్న పేర్లు మీడియాలో సంచనలంగా మారిపోతున్నాయి. పోలీస్, పొలిటికల్, సినిమా రంగంతోపాటు మీడియా రంగానికి చెందిన పలువురు ప్రముఖులు నయీంతో దోస్తీ చేశారనే విషయం డైరీల ఆదారంగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో గ్యాంగ్ స్టర్ నయీమ్ కు అనుచరుడిగా ఉండి, ఎన్నో దందాల్లో పాలు పంచుకున్న ఓ చానెల్ సీఈవో అరెస్ట్ కావటం సంచలనంగా మారింది.
కోమటిరెడ్డి కొడుకును నయీమే చంపాడా?
ఐటెన్ టీవీ చానల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ హరిప్రసాద్ రెడ్డిని నల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారంట. చానల్ ఏర్పాటు కోసం నయీంతో చేతులు కలిపి పలు సెటిల్ మెంట్లలో హరిప్రసాద్ పాల్గొన్నాడని పోలీసు వర్గాలు వెల్లడించాయి. హరిప్రసాద్ ను నాలుగు రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఆపై విచారణ జరిపి ఆయన అరెస్టును అధికారికంగా ప్రకటించారు.
నయీం నేరాలకు టీఆర్ఎస్ నేత సహకారం...
హైదరాబాద్ లోని చానల్ కార్యాలయంలో ఉన్న రూ. 13.50 లక్షల విలువైన కంప్యూటర్లు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. గత సంవత్సరం నల్గొండ ప్రకాశం బజారులో నయీం అనుచరుల ఆధ్వర్యంలో ఏర్పాటైన వినాయక విగ్రహం గురించి పేపర్లు, టీవీ చానళ్లలో ప్రచారం చేసేందుకు 80 మంది విలేకరులు, కెమెరామెన్లకు రూ. 80 వేలను, టైటాన్ గడియారాలను ఇచ్చాడని తమ విచారణలో వెల్లడైనట్టు నల్గొండ సీఐ శ్రీనివాస్ వెల్లడించారు. కాగా, ఐటెన్ చానల్ త్వరలో ప్రారంభానికి సిద్ధంకాగా, ఆశగా అందులో అడుగుపెట్టిన పదుల సంఖ్యలో ఉద్యోగులు వీధిన పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నయీం నేరచరిత్ర.. పాపాల పుట్ట.. కీలక అనుచరుడి అరెస్టు..
ITEMVIDEOS:నయీం టాలీవుడ్ లింకులపై...
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more