సైనిక తిరుగుబాటు ప్రయత్నం నుంచి బయటపడిన టర్కీలో ప్రస్తుతం ఎమర్జెన్సీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అధ్యక్షుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు జెండా ఎగరవేసిన సైన్యం సెగలు చల్లారక ముందే మరో దాడితో అక్కడి ప్రజలు ఉలిక్కిపడ్డారు. కుర్దిస్థాన్ వర్కర్స్ పార్టీ(పీకేకే)కి చెందిన 35 మంది మిలిటెంట్లను సైన్యం తుదముట్టించింది.
శుక్రవారం అర్థరాత్రి దాటాక మిలిటెంట్లు పెను అలజడినే సృష్టించారు. హక్కారీ ప్రావిన్స్లోని ఓ ఆర్మీ బేస్ను ముట్టడించేందుకు వారు విఫలయత్నం చేశారు. మిలిటెంట్లను గమనించిన అధికారులు వారిని అడ్డుకునేందుకు కాల్పులు జరిపారు. దీంతో 35 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. మిలిటెంట్లను గుర్తించి అప్రమత్తమైన సైన్యం వాయుదళం ద్వారా కాల్పులు జరిపి 28 మంది మట్టుపెట్టగా, మిగతావారిని తర్వాత చంపేశారు.
కుకుర్కా లో నిన్నంటి నుంచి ఇటువంటి దాడులు మొదలై కలకలమే చెలరేగిన సంగతి తెలిసిందే. కుర్దిష్ మిలిటెంట్లు, టర్కీ ఆర్మీ జవాన్ల మధ్య కాల్పులు జరిగాయి. అక్కడి కాల్పుల్లో ఎనిమిది మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
కాగా, సైన్యం తిరుగుబాటు జరిగాక 4 వేల మంది సైన్యాధికారులను ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. వీరిలో 5వేల మంది ఉన్నతాథికారులు ఉన్నారు. దీంతో వీరికి మద్దతుగా కొన్నిచోట్ల సైన్యం విధులను బహిష్కరిస్తుండగా, దీనిని ఆసరాగా చేసుకుని పీకేకే మిలిటెంట్లు రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే ఎయిర్ బేస్ స్వాధీనం చేసుకుని దాడులకు పాల్పడాలని ఫ్లాన్ వేసింది.
కాగా, నాటో భద్రతా దళాలు తమ ప్రాంతాలను మోహరించినప్పటి నుంచి టర్కీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ వార్ దాదాపు దశాబ్దంన్నరకు పైగానే కొనసాగుతుంది. రాజకీయ పార్టీగా ఉన్న కుర్థిస్థాన్ వర్కర్స్(పీకేకే) ను మిలిటెంట్ గ్రూప్ గా ప్రకటించడం, ఆపై వారు దురాగతాలకు పాల్పడటం జరుగుతూ వస్తోంది. సైన్యానికి-మిలిటెంట్లకు మధ్య జరుగుతున్న దాడుల్లో ఇప్పటిదాకా 70 వేలకు పైగానే పౌరులు బలైనట్లు సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more