తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్ 2 ప్రశ్నపత్రం లీక్ కేసులో నిందితుల అరెస్టుతో దీని ద్వారా సుమారుగా 70 మంది విద్యార్ధులు లభ్ది పోందారని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో పరీక్షను నిబంధలన మేరకు రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుందన్న సమాచారంతో విద్యార్థి లోకం తర్జనభర్జనలు పడుతుంది. వైద్య విద్య సహా దాని అనుబంధ కోర్సుల ప్రవేశాల కోసం తాము ఒకే ఏడాది ఎన్ని పర్యాయాలు మనోవేదనకు గురుకావాలని రాంకులు సాధించిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది నీట్ పరీక్షలు నిర్వహిస్తారని అది నుంచి అందుకోసం ప్రిపేర్ అయిన విద్యార్థులకు ఈ ఏడాది నీట్ నుంచి మినహాయింపు కల్పించడంతో రెండో ధఫా ఎంసెట్ 2 పరీక్షలు నిర్వహించారు.
ఈ పరీక్షా ప్రతాలు కాస్తా లీక్ గ్యాంగ్ చేతిలో పడటంతో.. మరలా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలు జారీ చేయడంతో తాము తీవ్ర మనోవేదనకు గురవుతున్నామని విద్యార్థులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఎంతో కష్టపడి రాసిన పరీక్షలలో ర్యాంకులు సాధించగా, ఎవరో కొందరు చేసిన లీకేజీ పాపానికి తాము బలి అవుతున్నామని గోడు వెళ్లబోసుకుంటున్నారు. మళ్లీ పరీక్ష రాస్తే మంచి ర్యాంకు వస్తుందో రాదోనని మధనపడుతున్నారు. మళ్లీ పరీక్ష పెట్టినా.. తాము తీవ్రఅసహనంతో పరీక్షలలో మెరుగైన ర్యాంకులు సాధించలేవమని భాధను వ్యక్తం చేస్తున్నారు.
‘మెడిసిన్లో సీటు మా కల. అందుకోసం చిన్నప్పటి నుంచి అన్ని ఆనందాలు వదులుకుని చదువుకున్నాం. తెలంగాణ, ఏపీల్లో ఎంసెట్, ఎంసెట్-2 రాశాం. కేంద్ర ప్రభుత్వం ‘నీట్’ అంటే అదీ రాశాం. ఎంసెట్-2లో మెరిట్ ర్యాంకు వచ్చింది. మంచి కాలేజీలో చేరుదామనుకుంటే.. లీకేజీ వ్యవహారం బయటపడింది. ఇప్పుడు ఎంసెట్-2 రద్దు చేసి మళ్లీ పరీక్ష పెడతామంటే మా గతేం కావాలి. ఇప్పటికి 5 పరీక్షలు రాశాం. ఇంకా ఎంట్రన్స్ టెస్ట్లు రాసే శక్తి మాకు లేదు..’.. ఎంసెట్-2 ర్యాంకర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ఎంసెట్ 2 పై ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నారని, నిబంధలన ప్రకారం పరీక్షలను రద్దు చేసే నిర్ణయానికే అయన కట్టుబడి వున్నారని సమాచారం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more