ప్రమాదం పోంచి వుందని సూచికలను ఏ ప్రమాదం వస్తుందిలే అని నిర్లక్ష్యం చేసే వారు లేకపోలేదు. ప్రమాదకరమైన మలుపు అని అధికారులు సూచికలు పెట్టినా నిర్లక్ష్య వైఖరితో వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడినవారు లేకపోలేదు. చెప్పడం మా ధర్మం, వినకపోతే మీ కర్మం అనే స్థాయికి వచ్చేశారు అధికారులు. ప్రమాదం ఎప్పుడు, ఎటు వైపు నుంచి వస్తుందో అంచనా వేయడంలో విఫలమవుతాం. అనూహ్యంగా వచ్చే ప్రమాదాల బారిన పడటం కంటే.. సూచికలను అనుసరించి వెళ్లడమే మంచిది కదా. ఇప్పుడీ విషయం చైనాలోని ఓ కుటుంబానికి తెలిసివచ్చింది.
సరిగ్గా చైనాలోని కూడా ఇదే జరిగింది. చైనా రాజధాని బీజింగ్ కు చేరువలోని బడాలింగ్ వన్య ప్రాణి పార్కులో వాహనాలు దిగరాదు అన్న సూచికలు దర్శనమిస్తున్నాయి. అయినా తమ ముందు వెనుక కార్లు వున్నాయన్న దైర్యంతో కారు దిగిన ఓ మహిళకు ప్రమాదం బారిన పడింది. వివరాల్లోకి వెళ్తే.. కుటుంబంతో కలిసి కారులో ప్రయాణిస్తోంది ఓ మహిళ. కారు ఆపి డ్రైవింగ్ చేసే వైపు నుంచి మారడానికి దిగి మరో డోర్ తెరిచింది అంతే ఇంతలోనే ఊహించని ఘటన జరిగింది. కారులోంచి ఎవరు దిగుతారా..? ఎవర్ని ఎత్తుకెళ్దామా అని పోంచి వున్న పులి.. కారు దిగిన మహిళను టార్గెట్ గా చేసకుంది.
అంతే క్షణాల్లో అక్కడికి చేరి ఆ మహిళను ఎత్తుకెళ్లి చంపి తినేసింది. కాపాడేందుకు వెళ్లిన ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ విషయాన్ని ఓ ఆన్లైన్ వెబ్సైట్ పబ్లిష్ చేసింది. చైనా రాజధాని బీజింగ్ యాంక్వింగ్ జిల్లా గ్రేట్ వాల్కు సమీపంలోని సఫారీ పార్క్ దగ్గర ఈ ఘటన జరిగింది. కాగా ఆ మహిళ కారు ఆపిన ప్రదేశం వన్యప్రాణులుండే ప్రదేశం. అయితే చుట్టుపక్కలా కార్లున్నాయి..తిరుగుతున్నాయి. పార్క్ నుంచి పులి ఎలా తప్పించుకుందన్న విషయం అక్కడి పార్క్ సిబ్బంది, అధికారులు ఆరా తీస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more