రైలు మిస్ కావడంతో నడుచుకుంటూ ఇంటికి బయలుదేరిన 16 ఏళ్ల బాలికను మార్గమధ్యంలో అపహరించి నాలుగు రోజుల పాటు కామాంధులు పైశాచికంగా అత్యాచారం చేసిన ఘటన వెలుగు చూసిన మరుసటి రోజునే మరో దారుణ ఘటన మహారాష్ట్రలోని గోండియాలో వెలుగుచూడటం మహారాష్ట్రలోని అడపడచుల మానప్రాణాల భద్రత, రక్షణపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. రైలు టికెట్ లేదని చెప్పిన బాలికను వెంట తీసుకువెళ్లిన యువకులు ఆమెపై సామూహిక అత్యాచారం జరిపిన సంఘటన మహారాష్ట్రలోని గోండియా పట్టణంలో జరిగింది.
పదోతరగతి చదువుతున్న 16 ఏళ్ల వయసుగల బాలిక తన తండ్రి, సోదరుడితో కలిసి బసంత్ నగర్ ప్రాంతంలో ఉంటోంది. బాలిక బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ గోండియా రైల్వేస్టేషనులో దిగింది. రైల్వేస్టేషనులో ఒంటరిగా ఉన్న బాలికతో నితీష్ రామదాసు బ్రహ్మాంకర్, ఛోట్టు అలియాస్ ప్రశాంత్ మోట్ఘేర్ లనే ఇద్దరు యువకులు మాటలు కలిపారు. మాటల్లో తన వద్ద రైలు టికెట్ లేదని బాలిక చెప్పడంతో టికెట్ కలెక్టర్ల బారిన పడకుండా ఆమెను బయటకు తీసుకువెళ్లారు.
గోండియా రైల్వే క్రాసింగ్ సమీపంలో శిథిలావస్థలో ఉన్న ఓ ఇంటికి బాలికను తీసుకువెళ్లిన ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారం జరిపారు. అనంతరం వారి స్నేహితులైన కలీంరఫీఖ్ ఖాన్, ముఖేష్ దేవిదాస్ మెష్రం లనే మరో ఇద్దరు యువకులు వచ్చి వారు కూడా బాలికపై అత్యాచారం చేశారు. బాలిక కుటుంబసభ్యులకు అత్యాచారం గురించి చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తుండగా మరో ఇద్దరు నిందితులు పరారీలో వున్నారు, పోలీసులు వారిపై కూడా నిఘా పెట్టినట్లు సమాచారం
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more