చేతులు కాలాక అకులు పట్టుకున్నట్లు అన్న చందం గుర్తుందిగా, సరిగ్గా అలాగే వుంది కేంద్రంలోని ప్రభుత్వం తీరు. గత కొన్నాళ్లుగా తీవ్ర ఉత్కంఠకు దారి తీసిన పరిణామంపై అర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తాను ఇక రెండో సారి కొనసాగనని స్పష్టం చేసిన తరువాత.. అ పదవికి రమారమి ఎనమిది పేర్లు పరిశీలనకు రాగా, అందులోంచి నలుగురిని షార్ట్ లిస్ట్ చేసి జాబితాను సిద్దం చేసినట్లు వార్తలు వచ్చిన తరువాత అర్భీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఘటికుడంటూ కేంద్రం కితాబివ్వడం కోసమెరుపు.
బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి, రఘురాం రాజన్ ను చులకన చేస్తూ.. ఆయన అర్భీఐ గవర్నర్ గా దేశానికి మేలు చేయలేదని, అమెరికాకు వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పుకోవాలంటూ ఘాటైన విమర్శలు చేసిన తరుణంలో అటు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో పాటు ప్రధాని నరేంద్రమోడీ కూడా మౌనంగా వుండిపోయారు. రెండో పర్యాయం అర్బీఐ గవర్నర్ గా పదవిని పోడగించే విషయమై ఎదురుచూసినా.. తనకు మద్దతు కరువైన నేపథ్యంలో రెండో పర్యాయం కోనసాగనని రాజన్ తేల్చిచెప్పారు,
ఇక రఘురామ్ రాజన్ అధ్యాయం ముగిసిన తరువాత ఆయన చేసిన పనులకు కితాబివ్వడం కేంద్రం వంతయ్యింది. ఎలాగు రఘురామ్ రాజన్ రెండో పర్యాయం వచ్చే అవకాశం లేదని తెలిసో, లేక అంతటి మేథావిని తాము చులకన చేసి పంపడం ఇష్టం లేకనో మొత్తానికి ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా ఖండించారు. రఘురాం రాజన్ తో పాటు ఆర్థిక మంత్రిత్వ శాఖలోని కొందరు అధికారులపై స్వామి చేసిన వ్యాఖ్యలు సరికాదని మోదీ తమ ఎంపీ వ్యాఖ్యాలపై సన్నాయి నోక్కులు నోక్కారు. ఆర్థిక రంగంలో రాజన్ అపార అనుభవమున్నవారని అన్నారు.
ఒక జాతీయ మీడియాతో ప్రధాని మోడీ మాట్లాడుతూ, "ఈ తరహాలో బహిరంగ విమర్శలు చేయడం దేశానికి మంచిది కాదు. బాధ్యతతో మెలగాలి. ఎవరైనా తాను వ్యవస్థకన్నా పైనున్నానని భావిస్తే, అది వారి స్వీయ తప్పిదమే అవుతుంది" అని అన్నారు. స్వామి పేరును ప్రస్తావించకుండానే ఆయన మెత్తగా మొట్టారు. తన సూచన చాలా స్పష్టమని, ఈ విషయంలో తనకు ఎలాంటి అనుమానాలు లేవని మోదీ అన్నారు. రాజన్ దేశభక్తిపై తనకు ఎలాంటి సందేహమూ లేదని పేర్కోన్నారు.
రాజన్ కు ఒక పదవి ఉన్నా లేకున్నా తన దేశానికి చేతనైనంత సాయం చేస్తూనే ఉంటారని తనకు తెలుసునని అన్నారు. ఆయన మంచి వ్యక్తని తనకు తెలుసునని, ఆర్బీఐ గవర్నరుగా తన విధిని ఆయన సక్రమంగా నిర్వర్తించారని పొగిడారు. రాజన్ తన పదవీకాలం పూర్తయ్యేంత వరకూ పదవిలో కొనసాగుతారా? అని ప్రశ్నించగా, ఆయన తన కాలపరిమితిని పూర్తి చేసుకునేంత వరకూ పదవిలో ఉంటారనడంలో సందేహం లేదన్నారు. ఆయన యూపీఏ హయాంలో వచ్చారు కాబట్టి, తానేదో అడ్డుకుంటున్నాననడం పూర్తి అవాస్తవమని అన్నారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more