యువ ఐపీఎస్ అధికారి, పాడేరు ఏఎస్పీ కె.శశికుమార్ మృతి కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శశికుమార్ గదిలో లభించిన మరణ వాంగ్మూలంగా పేర్కోంటున్న సూసైడ్ నోట్ ఎవరు రాశారన్న విషయమై ఇప్పుడు అధికారులు దర్యాప్తు కోనసాగిస్తున్నారు. శశికుమార్ స్వదస్తూరితో సూసైడ నోట్ రాశారా? లేదా? అనే కోణంలో హ్యాండ్ రైటింగ్ నిపుణుడితో పరిశీలన జరుపుతున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు సేకరించిన ఆధారాల ప్రకారం నివేదిక ఇప్పటికే హైదరాబాద్లో సిద్ధమైనట్లు సమాచారం. నేడో రేపో దర్యాప్తు అధికారులకు ఆ నివేదిక చేరనుంది.
తన కుమారుడు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, అతనిని రాజకీయ, అధికార వర్గాలు హత్య చేశాయని శశికుమార్ తల్లిదండ్రులు ఆరోపించడంతో తమిళనాడు పోలీసులు జిల్లాకు వచ్చి దర్యాప్తు చేస్తారని భావించినప్పటికీ ఇంతవరకూ అలాంటి సమాచారం తమకేమీ రాలేదని సీఐడీ అధికారులు అంటున్నారు. అయితే సీఐడీ డీఎస్పీ మరణానికి దారితీసిన పరిస్థితులపై ప్రధానంగా సీఐడీ దృష్టి సారించింది. రెండు సార్లు విచారణకు వెళ్లిన సీఐడీ అధికారులు అనేక మందిని విచారించి అనేక విషయాలను తెలుసుకున్నారు. శశికుమార్ ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన తరువాత మావోయిస్టు, మిలీషియా సభ్యులు, సానుభూతిపరుల అరెస్టులు గానీ, లొంగుబాట్లు గానీ జరగలేదు.
దీనిపై కూడా ఉన్నతాధికారుల నుంచి ఆయన ఒత్తిళ్లు ఎదుర్కొని ఉండవచ్చని తెలుస్తోంది. మావోయిస్టు సానుభూతిపరులనే నెపంతో గిరిజనులపై నమోదు చేసిన కేసులను శశికుమార్ మాఫీ చేశారని, ఆ విషయంలో ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యారని సమాచారం.ఆ కారణంగానే ఇటీవల మన్యంలో మావోయిస్టులు లొంగిపోయినప్పుడు ఏఎస్పీ కేడర్లో ఉన్న శశికుమార్కు బదులు ఓఎస్డీ అట్టాడ బాబూజీ విశాఖ ఎస్పీతో పాటు విలేకరుల ముందుకు వచ్చారు. మావోయిస్టుల లొంగుబాట్లలో ఏఎస్పీ ప్రమేయం ఉండటం లేదని ఉన్నతాధికారులు పదే పదే అంటుండటంతో శశికుమార్ మానసికంగా కుంగిపోయి ఉంటారని తెలుస్తోంది.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more