అదృష్టం వుంటే వేగంగా వెళ్లే రైలు కిందపడినా.. బతికిపోతుంటారు. ఇటీవల మతిస్థిమితం సరిగా లేని 60 ఏళ్ల వృద్దురాలు ముంబై సబర్బన్ రైల్వే స్టేషన్ లో రైలు కింద పడింది. రైలు పైలట్ అమెను గమనించి బ్రేక్ వేసేప్పటికీ అమెపై నుంచి రైలు ఒక బోగి వెళ్లింది. అది చూసిన వారంతా అమెకేమైందోనని కంగారు పడినా.. స్వల్ప గాయాలతో అమై ఆ ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఇలాంటి ఘటనలను చూసినప్పుడు పెద్దల సద్దులు గుర్తుకోస్తుంటాయ్. అదేనండీ భూమ్మిద నూకలు వుంటే.. ఎంత ప్రమాదమైన తొలగిపోతుందీ అని. ఇక మరికోందరై శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని.
సరిగ్గా ఇలాంటి ఘటనే గుజరాత్ లోనూ జరిగింది. అదృష్టం వుండబట్టి వారు బతికి బయటపడ్డారు కానీ లేని పక్షంలో మాత్రం అతివేగంతో వచ్చిన వాహనం వారిని ఎక్కడకు తీసుకెళ్తేదో.. ఏం చేసేదో ఊహించడానికే భయంగా వుంది. విషయంలోకి వస్తే ఇద్దరు మిత్రులు రోడ్డు పక్కన టీ దుకాణం దగ్గర కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. ఇంతలో ఊహించని ఘటన జరిగింది. వారిపైకి అనూహ్యంగా కారు దూసుకొచ్చింది. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే వారిని కారు గుద్దేసింది.
అక్కడున్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. కారు గుద్దేసిన వారికి ఏమైందోనని ఆందోళన చెందారు. అయితే ఈ ప్రమాదం నుంచి వారిద్దరూ స్వల్ప గాయాలతో బయట పడడం విశేషం. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. కారులోని వ్యక్తి పొరపాటున యక్సిలేటర్ పెంచడంతో కారు ఒక్కసారిగా దూసుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పెట్టారు. దీన్ని చూసిన వారంతా 'మిరాకిల్' అని వ్యాఖ్యానించారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more