పైసా ప్రపంచంలో బంధాలు, బంధుత్వాలు కానరాకుండా పోతున్నాయి. రక్తసంబంధీకులే డబ్బు కోసం పైశాచికంగా హత్యలు చేయటం, ఘోరాలకు పాల్పడటం నిత్యం మనం చూస్తున్నాం. కానీ, ఇక్కడో అక్క ఉదంతం ఇంకా ప్రేమలు, విలువలు ఉన్నాయని నిరూపిస్తోంది. తన చెల్లి కోసం ఈ భూమ్మీద ఎవరూ చేయని సాహసానికి సిద్ధపడిపోయింది.
చైనాలో హాంగ్ జౌ ప్రావిన్స్ లోని వులియన్ స్క్వేర్ లోని ఓ బిజీ రోడ్డు. ఎవరి పనుల్లో వారు మునిగిపోయి ఉండగా, హఠాత్తుగా ఒక యువతి ఓ కార్డ్ బోర్టు పట్టుకుని ప్రత్యక్షమైంది. దారిన పోయే వారందరూ ఆ బోర్డును చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. దాని మీద నా మీదకు బాణాలు సంధించండి. ఒక్కో బాణానికి పది యువాన్ చెల్లించండి అని రాసుంది. ఇంతలో ఓ వ్యక్తి సమీపంలోని పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి ఈ సమాచారాన్ని అందించాడు. పోలీసులు అక్కడికి చేరుకుని యువతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె చెప్పిన సమాధానం విని పోలీసులు కంటతడి పెట్టసాగారు.
ఆ యువతి పేరు జి జియాలీ. తండ్రి ఇటీవలె మరణించాడు. తన చెల్లి ప్రాణాంతకమైన లుకేమియాతో బాధపడుతోంది. అప్పులో ఉన్న తమ కుటుంబం ఇప్పుడు తన చెల్లికి వైద్యం అందించే స్థితిలో లేదు. వైద్య ఖర్చుల కోసం 3,50,000 యువాన్ లు(51లక్షలు) ఖర్చవుతాయని వైద్యులు చెప్పారు. అందుకే ఈ సాహసానికి ఒడిగట్టిందట. గతంలో మీడియా ముందుకు వచ్చి విజ్నప్తి చేసినా ఎవరూ సాయం చేయలేదని, ఇలా చేస్తేనైనా ఎవరైనా పట్టించుకుంటారేమోనని చెబుతోంది. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు చక్కర్లు కొడుతుండగా, పలువురు ఆమెకు సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more