ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కు నరేంద్ర మోదీ సర్కారు ఝలక్ ఇచ్చింది. రెండేళ్ల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికలలో గుజరాత్ ముఖ్యమంత్రిగా వున్న నరేంద్రమోడీని దేశానికి ప్రధాన మంత్రిగా చేయడంలో సఫలమైన రాజకీయ వ్యూహకర్తనే కేంద్రం టార్గెట్ చేసింది. బిహార్ ఎన్నికలలో ముఖ్యమంత్రి నితిప్ కుమార్ ను మరోమారు అధికార పీఠం దక్కేలా చేసిన ప్రశాంత్ కిషోర్ తీరుపై ఊపిరి బిగపట్టుకున్న కేంద్రం. ఉత్తర్ ప్రదేశ్ లో త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున ఆయన వ్యూహాలను రచించడం బీజేపికి మింగుడు పడుతున్నట్లు లేదు.
ప్రధాని నరేంద్రమోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్ సభ నియోజకవర్గం కూడా ఉత్తర్ ప్రదేశ్ లోనే వుండటం.. దీంతో మరోమారు ఆయన ప్రభంజనం వినిపించాలని ఇప్పటికే అరెస్సెస్ చేస్తున్న ప్రయత్నాలకు వ్యూహకర్త చెక్ పెడుతున్నారన్న వార్తలు అందుతున్నాయి. దీంతో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన అత్యధిక అసెంబ్లీ, ఎంపీ స్థానాలున్న ఉత్తర్ ప్రదేశ్ లో తమ గెలుపు నల్లేరు మీద నడక కాదని తెలుసుకున్న కేంద్రం ఇందుకు కారణమైన ఎన్నికల వ్యూహకర్తపైనే గురిపెట్టిందన్న విమర్శలు వినబడుతున్నాయి.
అందుకనే ఆయన నడుపుతున్న అసోసియేషన్ ఆఫ్ సిటిజన్స్ ఫర్ అకౌంట్ బుల్ గవర్నెన్స్(సీఏజీ)కు ఆదాయ పన్ను శాఖ నోటీసు పంపింది. గత నాలుగేళ్లకు సంబంధించిన ఆదాయ వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. సీఏజీ అహ్మదాబాద్ చిరునామాకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఎక్సైజ్ ఇంటెలిజెన్స్ ఈ నోటీసులు పంపింది. సీఏజీ అధికారులు తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. వార్షిక నివేదికలు, బిల్లులు, ఇన్ వాయిస్, ఖర్చులకు సంబంధించిన వివరాలు, బ్యాంకు స్టేట్ మెంట్స్ సమర్పించాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఆయన కంపెనీకి కేంద్ర ప్రభుత్వ సంస్థ నోటీసులు పంపడం చర్చనీయాంశంగా మారింది. మరి వీటిని వ్యూహకర్త ఎలా ఎదుర్కోంటారో వేచి చూడాలి.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more