దేశ ప్రధాని నరేంద్రమోడీ ఒక సంవత్సరం వయస్సును దాచేస్తున్నారా.? అయనకెందుకలా చేస్తున్నారు. సహజంగా అమ్మాయిలు వయస్సును, అబ్బాయిల వేతనాన్ని అడగోద్దని పెద్దలంటారు. కానీ ప్రధాని తన వయస్సును దాచే ప్రయత్నం చేస్తున్నారని విఫక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ప్రధాని విద్యార్హతలు ఏంటో తెలపాలని, యావత్ దేశ ప్రజలు ఆయన విద్యార్హతలను తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే సివీసీకి లేఖ రాయగా, ప్రధాని చదువు లేకపోయినా పర్వాలేదు కానీ ఆయన అసలు వయస్సెంతో చెప్పాలని మరోకరు ప్రశ్నిస్తూ.. ఆయనను ఇబ్బందికర పరిణామాలకు తెరతీస్తున్నారు.
ఇందుకు కారణం ఏటంటే.. ప్రధానికి రెండు పుట్టినరోజులు ఉండటమే. నిజమేనండీ.. మన దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీకి రెండు జన్మదినాలు వున్నాయి. అంటే ఆయన బాల్యంలో వున్న జన్మదినానికి, ఆయన ప్రధాని అయ్యాక ఆయన వెబ్ సైట్ లో వున్న జన్మదినానికి వత్యాసం సుమారుగా ఏడాది ఒక మాసం. అంటే సుమారుగా 13 నెలలన్నమాట. ఈ వ్యత్యాయం ఎందుకోచ్చిందో తెలియదుకానీ.. ఇప్పుడు విఫక్షాలు మాత్రం ఈ రెండింటిలో మోడీ అసలైన జన్మదినం ఏదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. విస్నగర్లోని ఎమ్మెన్ కాలేజీ రికార్డుల్లో మోదీ పుట్టిన రోజు ఆగస్టు 29, 1949 అని నమోదై ఉండగా, ప్రధాని అధికారిక వెబ్సైట్లో మాత్రం సెప్టెంబర్ 17, 1950 ఉండటంలో విపక్షాలు తీవ్రవిమర్శలు చేస్తున్నాయి.
తాజాగా ఈ విషయమై తక్షణమే ప్రధాని నరేంద్రమోదీ వివరణ ఇవ్వాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ తెలిపారు. భారతదేశ ప్రధాన మంత్రి కార్యాలయానికి విశ్వసనీయత ఉందని పేర్కొన్నారు. పుట్టిన రోజును నిర్ధారణ చేసుకోవడానికి హై స్కూల్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్కు సంబంధించి సర్టిఫికెటన్లను ప్రధాని ఎందుకు బయట పెట్టలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. చదువు రాని ప్రధాన మంత్రి అయినా మాకు ఫర్వాలేదు, కానీ ప్రధాన మంత్రి తన విద్యార్హత, పుట్టిన తేదీ విషయంలో నిజాయితీగా లేకపోతే మాత్రం మేము సహించేది లేదని ట్విట్టర్ ద్వారా తెలిపారు.
మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more