ఏపిలో ప్రస్తుతం ప్రతిపక్ష పార్టీ ఏ పరిస్థితిని ఎదుర్కొంటుందో అందరికి తెలుసు. పార్టీ నుండి ఎమ్మెల్యేలు, నాయకులు ఒక్కొక్కరుగా అధికారపక్షంలోకి వెళ్లిపోతున్నారు. దాదాపుగా వైసీపీ పార్టీకి నిన్నటి దాకా బలం అనుకున్న నాయకలు అందరూ పార్టీని వీడి సైకిలెక్కుతున్నారు. ఇప్పుడిక తెలంగాణలో ఉన్న ఒకే ఒక్క నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ మారుతున్నారు. ఇప్పటికే మిగిలిన పార్టీల బలాన్ని తీసివేసిన కేసీఆర్.. తాజాగా పొంగులేటిని పార్టీలో కలుపుకోవడానికి ప్లాన్ సిద్దం చేయగా అది బాగా వర్కవుట్ అయింది. పొంగులేటితో పాటుగా మరో నాయకుడు కూడా టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. మొత్తానికి ఏపిలో ఫ్యాన్ కు ఎదురుగాలి వీస్తోంది అంటే తెలంగాణలో ఏకంగా రెక్కలే ఊడిపోయాయి.
తెలంగాణ రాష్ట్రంలో వైసీపీ ఉనికి ఉన్నది కేవలం ఖమ్మం జిల్లాలోనే. ఇప్పుడు అక్కడ కూడా ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోనున్నాయి. పాలేరు ఉపఎన్నిక విజయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ఎస్. విపక్ష నేతల్ని తనవైపు తిప్పుకోవడం ద్వారా ఎదురులేని శక్తిగా నిలవాలని భావిస్తోంది. అందులో భాగంగా ఈసారి వైసీపీని టార్గెట్ చేశారు. ఇప్పటికే పాలేరు వైసీపీ అధ్యక్షుడు గులాబీ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డితోపాటు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కూడా కారెక్కేందుకు ముహూర్తం సిద్ధం చేసుకున్నారు. బుధవారం సీఎం కేసీఆర్ సమక్షంలో ఇద్దరూ గులాబీ కండువా కప్పుకోనున్నారు
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more