విశాఖ సాగరతీరంలో అంతర్జాతీయ నౌకా దళ సమీక్ష ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ ముఖ్యఅతిథిగా హాజరై నౌకాదళాల గౌరవందనం స్వీకరించారు. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ వేడుకల మూడో రోజు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి మనోహర్ పారికర్, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నౌకాదళ అధికారులు పాల్గొన్నారు. విశాఖపట్నంలో జరుగుతున్న ఐఎఫ్ఆర్ వేడుకల్లో భాగంగా యుద్ధనౌక ఐఎన్ఎస్ సుమిత్రలో ప్రణబ్, మోదీ ప్రయాణించారు. అనంతరం ఐఎన్ఎస్ సుమిత్రలో నౌకాదళ సమీక్షకు రాష్ట్రపతి బయలుదేరారు.
రాష్ట్రపతితో పాటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రక్షణమంత్రి మనోహర్ పారికర్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నౌకాదళ ప్రధాన అధికారులు ఐఎన్ఎస్ సుమిత్రలో బయల్దేరారు. వానే ప్రయాణిస్తున్న సుమిత్ర యుద్ధనౌకను మరో ఐదు నౌకలు అనుసరిస్తున్నాయి. అన్ని నౌకలపై నుంచి రాష్ట్రపతి గౌరవవందనం స్వీకరిస్తారు. అంతకు ముందు రాష్ట్రపతి నౌకాదళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. విశాఖ తీరంలో బంగాళాఖాతంలో 6 వరుసల్లో 70 యుద్ధనౌకలను మొహరించారు. యుద్ధ నౌకల సామర్థ్యాన్ని రాష్ట్రపతి పరిశీలించనున్నారు. ఫ్లీట్ రివ్యూ బ్రాండ్ అంబాసిడర్లుగా బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, కంగనా రనౌత్ వ్యవహరిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more