మరోసారి సక్షన్ 8 అంశం వార్తల్లోకి వచ్చింది. విభజన చట్టంలోని సెక్షన్ 8 కింద ఉమ్మడి రాజధానిలో శాంతిభద్రతలను కాపాడే బాధ్యత గవర్నర్ కు అప్పగించాలని మరోసారి డిమాండ్ వినిపిస్తోంది. ఎంఐఎం దాడులతో హైద్రాబాదులో సెక్షన్ 8 అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. ఓల్డ్ సిటీలో జరిగిన ఘటనలపై అఖిలపక్ష నేతలు ముక్తకంఠంతో ఖండించారు. హైద్రాబాదులో ఎంఐఎం-టీఆర్ఎస్ అరాచకాలు సృష్టిస్తోందని గవర్నర్, ఈసీకి ఫిర్యాదు చేశారు. సెక్షన్ 8అమలు చేసి రాజ్యాంగ పరిరక్షణ చేయాలని కోరారు.
గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల రోజు ఎంఐఎం పార్టీ అరాచకాలపై అఖిలపక్ష నేతలు భగ్గుమన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ కు టీడీపీ, బీజేపీ, వైసీపీ నేతలు హాజరయ్యారు. సీపీఐ, సీపీఎం నేతలు అందుబాటులో లేకపోయినా..ఫోన్లో మద్దతు ప్రకటించారు. పాతబస్తీలో కాంగ్రెస్ నేతలు ఉత్తమ్, షబ్బీర్ అలీతోపాటు బీజేపీ కార్పొరేటర్లు, ఎంబీటీ నేతలపై ఎంఐఎం దాడులను ఆల్ పార్టీ నేతలు తీవ్రంగా పరిగణించారు. ప్రభుత్వం అండతోనే ఎంఐఎం అరాచకాలకు పాల్పడుతోందని ఫైరయ్యారు.
టీఆర్ఎస్ పాలనలో శాంతిభద్రతలు లోపించాయని అఖిలపక్ష నేతలు గవర్నర్ నరసింహన్ కు మొరపెట్టుకున్నారు. ఎంఐఎం చేతిలో ప్రభుత్వం కీలుబొమ్మగా మారిపోయిందని ఆరోపించారు. పాతబస్తీలో దాడులు జరిగి 24గంటలు దాటినా ఏ ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. పాతబస్తీలో ఎంఐఎం అరాచకాలు..కొత్తబస్తీలో టీఆర్ఎస్ ఆగడాలు తారాస్థాయికి చేరాయని ఫిర్యాదు చేశారు. తక్షణమే జోక్యం చేసుకుని విభజన చట్టంలో పొందుపర్చిన హక్కులను అమలు చేసి..హైద్రాబాదులో సెక్షన్ 8అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగ పరిరక్షణ చేయాలని గవర్నర్ ను కోరారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more