ఏపిలో తీవ్ర సంచలనం రేపిన కఠారి అనురాధ, మోహన్ దంపతుల హత్య కేసులో నిందితుడిగా బావిస్తున్న చింటు నాటకీయంగా చిత్తూరు కోర్ట్ లో లొంగిపోయారు. చిత్తూరు మేయర్ దంపతులను మేయర్ కార్యాలయం వద్దే గుర్తుల తెలియని అంతకులు హత్య చేయడం తీవ్ర కలకలాన్ని రేపింది. కాగా హత్య చేయించింది.. చింటు రాయల్ అని అనుమానించిన పోలీసులు అతడి కోసం వెతికారు. మేయర్ హత్య తర్వాత కనిపించకుండా పోయిన చింటు మీద మరిన్ని అనుమానాలకు ఆస్కారం లభించింది. అయితే మేయర్ తో డబ్బుల విషయంలో వచ్చిన కొన్ని మనస్పర్దల వల్ల మర్డర్ కు ప్లాన్ చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఇన్ని రోజులుగా పోలీసులకు చిక్కకుండా తిరిగిన చింటే చిత్తూరు కోర్టులో ఎలా లొంగిపోయాడు అన్న దాని మీద చర్చ సాగుతోంది.
మేయర్ హత్య మీద ఏపి ప్రభుత్వం సీరియస్ గా విచారణ చేయిస్తోంది. ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు మేయర్ హత్య కేసు మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. మేయర్ కుటుంబానికి దగ్గరి బంధువే అయిన చింటు రాయల్ వారి హత్యకు కారణమని పోలీసులు అనుమానించారు. కాగా ఈ హత్యతో ముడిపడిన ముగ్గురు నిందితులు మురగ, పరంధామ, హరిదాసులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే సమయంలోనే చింటు చిత్తూరు కోర్టులో లొంగిపోయారు. తనకు, ఆ హత్యకు ఎలాంటి సంబందం లేదని చింటు గతంలో లేఖ రాశాడు. మరి ఎలాంటి సంబందం లేకపోతే మేయర్ హత్య తర్వాత ఎందుకు పారిపోయాడు..? ఎక్కడికి పారిపోయాడు..? ఇలాంటి ప్రశ్నలకు పోలీసులే త్వరలోనే క్లారిటీ ఇస్తారు. మొత్తానికి పోలీసులు వెతుకుతున్న చింటు రాయల్ తనంతట తానే స్వయంగా కోర్ట్ లో లొంగిపోవడంతో ఈ కేసు ఓ కొలిక్కివచ్చినట్లు కనిపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more