వస్తుసేవల పన్ను బిల్లుకు(జీఎస్టీ) ప్రతిబంధకాలు తొలిగిపోతున్నాయనే ఆశలు చిగురించాయి. ప్రధాని నరేంద్ర మోడీ అదే అంశంపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్లతో ఇక్కడి తన అధికారిక నివాసం 7, రేస్కోర్సు రోడ్డులో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బిల్లుపై కాంగ్రెస్ నేతలు లేవనెత్తిన మూడు అభ్యంతరాలపై మోడీ స్పందించారు. ప్రభుత్వ స్పందనపై పార్టీలో చర్చిం చిన అనంతరం కాంగ్రెస్ నేతలకు ప్రభుత్వానికి మధ్య మరోసారి చర్చలు జరిగే అవకాశం ఉంది. సమావేశానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్య నాయు డు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హాజరయ్యారు.
సమావేశం ముగిసిన అనంతరం అరుణ్ జైట్లీ విలేకరులతో మాట్లాడుతూ ''పార్లమెంట్ శీతాకాల సమా వేశాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించే నిమిత్తం ప్రధాని మోడీ సోనియాజీ, మన్మోహన్జీలను ఆహ్వానిం చారు. జీఎస్టీ బిల్లుపైన కూడా చర్చ జరిగింది. కాంగ్రెస్ నేతలు మూడు అంశాలను ప్రధానంగా ప్రస్తావించా రు.వారు లేవనెత్తిన మూడు అభ్యంతరాల్లో రాజ్యాంగ బిల్లులో ప్రతిపాదిత 18 శాతం రేటును ప్రధానంగా ప్రస్తా వించాలని డిమాండ్, అంతర్ రాష్ట్ర సరకు రవాణాపై అదనంగా ఒక శాతం సుంకంవిధింపు పట్ల వ్యతిరేకత, ఐదేళ్ల కాలానికి ఆదాయం కోల్పోయే రాష్ట్రాలకు 100 శాతం పరిహారం లాంటివి ఉన్నాయి '' అని తెలిపారు. ''బిల్లు తాలూకు చరిత్ర, నేపథ్యం, వారు లేవనెత్తిన మూడు అంశాలపై ప్రభుత్వ స్పంద నను కూడా కాంగ్రెస్ నేతలకు పూసగు చ్చినట్టుగా వివరించాం'' అని కేంద్ర ఆర్థిక మంత్రి వెల్లడించారు. ''దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతలు వారి సొంత పార్టీలో చర్చించుకుం టారు. ఆ తర్వాత కొంత కాలానికి ఈ అంశం పె మరింత చర్చించడానికి ప్రభుత్వం, కాంగ్రెస్ నేతలు మళ్లిd సమావేశ మవుతారు. వారు మాతో చర్చించిన విషయాలను మేమూ పరిగణనలోకి తీసుకుంటాం'' అని జైట్లీ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more