మహారాష్ట్రలోని థానే జిల్లా భాయిదర్ పట్టణంలోని ఓ పాఠశాలలో తొమ్మిదేళ్ల చిన్నారిపై ఆ పాఠశాలకు చెందిన గురువింద గురువులు కాదు కామాంధకారులు, పైశాచిక మృగాళ్లు తెగబడ్డాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు ఉపాధ్యాయులు తొమ్మిదేళ్ల చిన్నారిపై పలుమార్లు అత్యాచారం చేశారు. గంట మోగగానే అందరూ తర్వాత సబ్జెక్ట్ పుస్తకాలు సిద్ధం చేసుకుంటుండగా, తాను మాత్రం ఆ సంకటం నుంచి ఎలా బైటపడాలా అని మథనపడుతూ ఉంటుంది. ఎందుకంటే పాఠాలు చెప్పడానికొచ్చే ఆ టీచర్లు తననే చూస్తారు. అదోలా మాట్లాడతారు. క్లాస్ లో ఎవ్వరూ లేనప్పుడు, అప్పుడప్పుడూ స్టాప్ రూమ్ లోకి తీసుకెళ్లి ఏదేదో చేస్తారు. తాము చేసింది బయటికి చెబితే చంపేస్తామని బెదిరింపులకు కూడా గురిచేస్తారు. ఏడాది కాలంగీ ఈ మనోవేదన తనలో తాను అనుభవించిందే కానీ.. వారి అఘాయిత్యాల గురించి మాత్రం ఎవరికీ చెప్పలేదు.. ఆ చిన్నారి.
అలా ఏడాది గడిచింది. ఉపాధ్యాయులు తనపై జరుపుతున్నది ఘోర అకృత్యమని అర్థం చేసుకునేంతగా కూడా ఎదగలేదా చిన్నారి. నాలుగో తరగతి చదువుకు, 9 ఏళ్ల వయసుకు... భారీ ఆకారాలున్న టీచర్లు జరిపే లైంగికదాడిని ఎదిరించే శక్తి ఎక్కడినుంచి వస్తుంది? అందుకే బాధను అనుభవించింది. క్రమంగా విరక్తిలోకి ప్రవేశించింది. అప్పుడుగానీ ఆమె తల్లిదండ్రులు గుర్తించలేకపోయారు.. తమ బిడ్డను ఎవరో హింసిస్తున్నారని. చివరికి ఒక రోజు ఆ చిన్నారే అన్ని చెప్పేసింది.. దీంతో వారు పోలీసులకు పిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు మగమృగాళ్లను అరెస్ట్ చేశారు. గత ఏడాది నుంచి విద్యార్థినిపై తరచూ లైంగిక దాడికి చేస్తున్న సంజయ్ పాటిల్ (47), నీలేశ్ భోయిర్ (47), జితేంద్ర జాద్ (23) అనే ముగ్గురు టీచర్లపై ఐపీసీ 376, 323, 504, 506 సెక్షన్లతోపాటు పోస్కో చట్టంలోని 2, 3 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more