ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అన్నట్లు వరంగల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి పసనూరి దయాకర్ దిమ్మతిరిగేలా ఓట్లను సొంతం చేసుకున్నాడు. ముందు నుండి కూడా లీడ్ లో కొనసాగిన దయాకర్ చివరకు రికార్డ్ స్థాయిలో మెజార్టీ సంపాదించారు. కారు దెబ్బకు వరంగల్ లో ప్రతిపక్షాలకు డిపాజిట్లు గల్లందయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి, బిజెపి, టిడిపి ఉమ్మడి అభ్యర్థి టిఆర్ఎస్ అభ్యర్థిని అందుకోవడంలో విఫలమయ్యారు. ఓరుగల్లు ఖిల్లా రాజు ఎవరా అన్న ఉత్కంఠకు తెర పడింది. వరంగల్ లో గులాబీదళానికి పట్టం కట్టిన ఓటర్లు.. భారీ మెజారిటీతో పసనూరి దయాకర్ ను గెలిపించారు. టిఆర్ఎస్ అభ్యర్థి నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల తొంభై రెండు ఓట్లతొ గెలుపును సొంతం చేసుకోగా.. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ లక్ష యాభై ఆరు వేల మూడు వందల పదిహేను ఓట్లు, బిజెపి అభ్యర్థి పగిడిపాటి యాదయ్య లక్ష ముప్పై వేల నూటడెబ్బై ఎనిమిది ఓట్లను సంపాదించారు. ఇక వైసీపీ అభ్యర్థి సూర్యప్రకాశ్ కు కేవలం ఇరవై మూడు వేల మూడు వందల ఇరవై ఐదు మాత్రమే వచ్చాయి.
Also Read: కారోళ్లు హుషారు.. మిగిలిన వాళ్లు బేజారు
టిఆర్ఎస్ అభ్యర్థికి పసనూరి దయాకర్ కు వచ్చిన ఓట్లు... 4,59,092
కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణకు వచ్చిన ఓట్లు.........1,56, 315
టిడిపి, బిజెపి ఉమ్మడి అభ్యర్థి యాదయ్యకు వచ్చిన ఓట్లు...1,30, 178
వైసీపీ అభ్యర్థి సూర్య ప్రకాశ్ కు వచ్చిన ఓట్లు.........................23,325
Also Read: వరంగల్ కింగ్.. దయాకర్
వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయదుందుభి మోగించింది. ఆ పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్ 4,59,092 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దేశంలోనే ఆరో అత్యధిక మెజారిటీ సాధించిన వ్యక్తిగా చరిత్ర పుటల్లోకెక్కారు.మెజారిటీపరంగా చూస్తే పసునూరిది దేశవ్యాప్తంగా ఆరో అత్యధిక మెజారిటీగా రికార్డయింది. అంతకు ముందు 2014లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రీతమ్ ముండే బీడ్ పార్లమెంట్ స్థానం నుంచి 7 లక్షల ఓట్లకు పైగా మెజారిటీ సాధించి దేశ ఎన్నికల చరిత్రలో అత్యధిక మెజారిటీ సాధించిన మొదటి అభ్యర్థిగా రికార్డు సృష్టించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more