అన్నదాతల పంట రుణాన్ని ఒకేసారి మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ, రైతుల సమస్యలపై కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్షాలు, ప్రజా సంఘాలు పిలుపునిచ్చిన బంద్ ఈ తెల్లవారు జాము నుంచే ప్రారంభమైంది. రుణ మాఫీకి ఏకమొత్తంలో నిధులు విడుదల చేయాలని, రైతుల ఆత్మహత్యల నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ప్రతిపక్షాలన్నీ ఒక్కటై శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నాయి. ఆయా పార్టీల నేతలు వివిధ జిల్లాల్లో ఆర్టీసీ డిపోల ఎదుట ధర్నాలకు దిగారు. హైదరాబాద్ లో దిల్ సుఖ్ నగర్ ఆర్టీసీ డీపో ముందు మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బైఠాయించారు. ఆయనను పోలీసులు అరెస్టు చేసి అంబర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. అలాగే కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్ రెడ్డి, అనేక మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
జూబ్లీబస్టాండ్ ఎదుట విపక్షాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో ఎర్రబెల్లి దయాకర్రావు, ఎల్. రమణ, రేవంత్రెడ్డి, సాయన్న మాగంటి గోపీనాథ్, లక్ష్మణ్, చింతల, పొంగులేటి తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా విపక్షాల బంద్ ప్రబావం తెలంగాణ జిల్లాలో కాస్త ప్రభావం చూపుతున్నా.. హైదరాబాద్ నగరంలో మాత్రం ఎలాంటి ప్రబావం చూపించడం లేదు. సిటీ సర్వీస్ బస్సులు యదాతదంగా నడుస్తున్నాయి. బంద్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక డిపోల నుంచి బస్సులు బయటికి రాలేదు. ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లోని బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్ తాను చెప్పిన హామీలను అమలు చేయడం లేదని రాంరెడ్డి దామోదర్-రెడ్డి విమర్శించారు. రోజు రోజూకూ అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం కళ్ళు తెరవాలని, రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more