అరుణాచల్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. తండ్రి లాంటి వాడు తన పాలిట పైశాచికంగా అత్యాచారానికి యత్నిస్తాడని తెలియదు ఆ చిన్నారికి. ఇరుగు పోరుగు వారు కావడంతో చనువుతో వచ్చిన చిన్నారిని చాక్లెట్లు, బిస్కెట్లు ఆశ చూపి రెండు రోజుల పాటు అతి దారుణంగా, అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఆ కసాయి. వివరాల్లోకి వెళ్తే.. అరుణాచల్ ప్రదేశ్ లోని తూర్పు కమెంగ్ జిల్లాలోని సెప్పా ప్రాంతంలో నివసిస్తున్న ప్రభుత్వ వ్యవహాసయ శాఖ ఉద్యోగి లోగో సింఘి.. కామంతో కళ్లు మూసుకుపోయి ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
తమ పోరుగున నివసించే ఓ చిన్నారిపై కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. అక్టోబర్ 2, 3 రోజుల్లో బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేరని తెలుసుకున్న సదరు ప్రభుత్వోద్యోగి బాలికను తన నివాసంలోకి పిలుచుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి తల్లిదండ్రుల పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిపై అత్యాచార యత్నం, సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తూర్పు కమెండ్ మహిళా శిశు సంక్షేమ సంఘం కామాంధుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. ర్యాలీని కూడా నిర్వహించింది.
కాగా తూర్పు కమెండ్ సాంఘిక సంక్షేమ మరియు సంస్కృతిక శాఖ ఈ ఘటనను అత్యంత క్రూరమైనదిగా పేర్కోంది. అమానవీయ చర్యగా అభివర్ణించింది. మహిళలు, చిన్నారుల పట్ల ఇంతటి తీవ్ర వ్యతిరేకమైన భావన వుండటం సహేతుకం కాదంది. తన మనవరాలి వయస్సున్న బాలికను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి చెరచడం సభ్య సమాజం తలదించుకునే చర్యని పేర్కోంది. బాలిక మనోవేదనను అర్థం చేసుకోకుండా వరుసగా రెండు రోజుల పాటు ఈ దారుణానికి ఒడిగట్టిన నీచుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. నిందితుడిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. ఇలాంటి దారుణ ఘటనలను సభ్య సమాజం తీవ్రంగా ఖండించాలని కోరింది
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more