తన కాపురం కంటే.. ఆత్మాభిమానమే మిన్నంటూ పుట్టింటికి అలిగిపోయిన భార్యను అమె కోరిక నేరవేర్చి.. తన ఇంటికి సగర్వంగా తీసుకోచ్చాడు భర్త. ఇంతకీ విషయం ఏమిటంటే... తన భర్త ఇంట్లో టాయ్లెట్ లేకపోవడం.. దీంతో ఆరుబయటకు వెళ్లి బహిర్భూమికి వెళ్లడం ఇష్టంలేని భార్య..తన భర్త నిర్మించేదాకా.. కాపురానికి వచ్చేదిలేదని భీష్మించింది. ఇలా ఆ ఇల్లాలు 19 నెలలుగా భర్తకు దూరంగా ఉంటోంది. చివరకు భర్త ఆమె డిమాండ్ నెరవేర్చేందుకు అంగీకరించాడు. మధ్యప్రదేశ్ లోని బెతుల్ జిల్లాలోని షాపూర్లో ఈ సంఘటన జరిగింది.
రెండేళ్ల క్రితం మోహన్ పటేల్ (23)తో సీమా పటేల్(20)కు వివాహమైంది. ఇంట్లో టాయ్లెట్ నిర్మించాల్సిందిగా తన భర్తను పలుమార్లు కోరింది. అయితే మోహన్ నిర్లక్ష్యం చేశాడు. ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకపోవడంతో సీమా అలిగి తన పుట్టింటికి వెళ్లిపోయింది. మోహన్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా టాయ్లెట్ నిర్మించేవరకు కాపురానికి రానని సీమా పంతం పట్టింది. సమస్య పరిష్కారం కోసం భర్త ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను ఆశ్రయించాడు. ఇటీవల ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ నిర్వాహకులు ఇరు కుటుంబాలను పిలిచి నచ్చజెప్పారు. సీమా కోరిక న్యాయమైందని, నెల లోపు టాయ్లెట్ నిర్మించాలని మోహన్కు సూచించడంతో అంగీకరించాడు.
బెతుల్ ఎస్పీ రాకేష్ కుమార్ మాట్లాడుతూ.. స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమంలో పోలీసులు కూడా పాల్గొంటున్నారని, ఫ్యామిలీ కౌన్సిలింగ్ నిర్వాహకుల సూచనను స్వాగతిస్తున్నట్టు చెప్పారు. ఇదే జిల్లాలో 2011లో అనితా నారే అనే గిరిజిన మహిళ టాయ్లెట్ డిమాండ్తో భర్తను వీడి పుట్టింటికి వెళ్లిపోయింది. ఎన్జీవో సులభ్ ఇంటర్నేషనల్ స్పందించి ఆమెకు 5 లక్షల రూపాయలను బహుమతిగా అందించింది. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చిన అనితకు రాష్ట్రపతి అవార్డు దక్కింది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more