ఉభయ గోదావరి జిల్లాలలో చిన్నారి విద్యార్థుల నుంచి నలభై ఏళ్లు పైబడిన మహిళల వరకు అందరూ ఇప్పడు భయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఎక్కడి నుంచి ఎప్పుడు తమను సైకో సూదిగాళ్లు దాడులు చేస్తారో తెలియక భయాందోళనకు గురవుతున్నారు. ఇన్నాళ్లు ఒక్కేడే సైకో.. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇంజక్షన్లు ఇస్తున్నాడన వార్తలతో తమవారితో కలసివెళ్లేందుకు, లేక గుంపులుగా వెళ్లేందుకు సుముఖత చూపిన మహిళలు.. అసలు ఎందమంది సైకోలు వున్నారన్న విషయం తెలియన భయాందోళనకు గురవుతున్నారు.
భాధితులు అందించిన సమాచారం మేరకు పోలీసులు ముందుగా ఒక సైకో ఊహాచిత్రాన్ని గీయించారు. తాజాగా మరో సైకో సూదిగాడి ఊహాచిత్రాన్ని గీయించారు. అయితే ఈ రెండు ఊహాచిత్రాలకు కనీసం పోలీకలు కూడా లేకపోవడంతో అసలెందరు సైకోలు ఉభయగోదావరి జిల్లాల్లో సంచిరిస్తున్నారన్న విషయం అర్థకాక పోలీసులే తలపట్టుకోవాల్సి వస్తుంది. ఇప్పటికే సైకో సూదిగాళ్ల సమాచారం అందించిన వారికి లక్ష రూపాయల పరిహారం అందిస్తామని ప్రకటించినా.. ఇప్పటివరకు ఎలాంటి ముందగుడు పడలేదు. గోదావరి జిల్లాలను పోలీసులు జల్లెడ పడుతున్నా.. సైకో ఆచూకీ మాత్రం చిక్కడం లేదు.
మరోపక్క సైకో సూదిగాళ్లు గోదావరి జిల్లాల పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయన్నది వాస్తవం. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా సిద్ధాంతం, దువ్వలో ఇంజక్షన్ సైకో సంచారం చేస్తున్నాడని వదంతులు వినిపిస్తున్నాయి. సైకోను పట్టుకోబోయిన వ్యక్తి నుంచి దాడులకు పాల్పడుతున్న ఇంజక్షన్ సైకో తప్పించుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. అయితే, సైకోను ఓ వ్యక్తి పట్టుకోవడానికి ప్రయత్నించగా సిరంజీలు, చెప్పులు అక్కడి వదిలి పారిపోయాడని ఆ ప్రాంతాల వాళ్లు అంటున్నారు. సైకోకు మరో వ్యక్తి కూడా సహాయం చేస్తున్నాడని బాధితుల తాజా సమాచారంపై కూడా పోలీసులు నిఘా పెట్టారు. మరి ఎప్పటికీ వీళ్లు దొరుకుతారో వేచి చూడాలి మరి
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more