మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఒక్కసారిగా విస్తుపోయారు. కరువు కోరల్లో చిక్కకున్న మరట్వాడ ప్రాంతంలో గత మూడు రోజులుగా పర్యటించిన ఆయన.. సుమారుగా 31 గ్రామాలలో 30 వేల పైచిలుకు మంది రైతులను కలసుకుని మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి ఆర్జీలను స్వీకరించి.. ప్రభుత్వం మీకు అండగా వుంటుందని భరోసా కల్పించారు. అయితే ఆయన భరోసా యాత్ర మాత్రం రైతులలో ధైర్యాన్ని నింపడం లేదు. ఆయన పర్యటించిన వెళ్లిన 8 గంటల వ్యవధిలోనే ఉస్మానాబాద్ జిల్లాలో రైతు ఆత్మహత్యకు పాల్పడటమే ఇందుకు తార్కణంగా నిలుస్తుంది.
బుధవారం సాయంత్రం దేవేంద్ర ఫెడ్నావిస్ ఉస్మానాబాద్ లో పర్యటించారు. ఆయన పర్యటించిన 8 గంటల అనంతరం పట్సాన్గవి గ్రామానికి చెందిన మనీష్ పటిల్ అనే రైతు ముఖ్యమంత్రి హామీలలో కొత్తధనం ఏమీ లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇదిలావుండగా, పర్బానీ జిల్లాలో దేవేంద్ర ఫడ్నావిస్ కు రైతుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో రైతులు సభలో రభస చేశారు. కరువు ప్రాంతాల రైతులకు సంభంధిచిన రుణాలను ప్రభుత్వం ఎందుకు మాఫీ చేయలేకపోతోందని రైతులు నినదించారు.
ఇక పర్బానీ జిల్లాలో మరోచోట ముఖ్యమంత్రి దేవంద్ర ఫడ్నావిస్ కు అనూహ్య పరిణామం ఎదురైంది. ఓ గ్రామంలో సభ నిర్వహిస్తుండగా మాధవ్ భాలేరావ్ అనే రైతు నుంచి విస్తుపోయే ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో ఫడ్నవీస్ ఓ క్షణంపాటు తన ప్రసంగాన్ని ఆపేయాల్సి వచ్చింది. తమకు చెరుకు పంట సొమ్ము చెల్లించాలని. లేదా తాను ఆత్మహత్య చేసుకుంటానని ఏకంగా ముఖ్యమంత్రికే తేల్చిచెప్పారు రైతు. ఫ్యాక్టరీకి పంట మొత్తాన్ని తరలించి ఆరు నెలలైందని.. ఆ ప్యాక్టరీ కూడా మీ ప్రభుత్వంలోని కీలక మంత్రి పంకజ్ ముండేదని సభికులు సాక్షిగా చెప్పాడు.
అయితే ఆరుమాసాలు కావస్తున్నా... ఇప్పటి వరకు తనకు రూపాయి కూడా యాజమాన్యం చెల్లించడం లేదని చెప్పాడు.. ఎంత అడిగినా పట్టించుకోవడం లేదన్నారు. . మీరు వాటిని చెల్లించేలా చర్యలు తీసుకోండి లేదా ఆత్మహత్య చేసుకుంటాననని రైతు మాదవుడు అభ్యర్థించాడు. ఇది తన ఒక్కడి సమస్య కాదని ఇక్కడ ఉన్నవారందరీ సమస్య' అని ఫడ్నవీస్ను ప్రశ్నించారు. దీంతో ఒక్క క్షణంపాటు ఆగి త్వరలోనే మీకు ఆ మొత్తం అందుతుందని స్వయంగా ముఖ్యమంత్రి రైతు మాధవ్ భాలేరావ్ తెలిపారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more