పంజాబ్ లో ఏకంగా ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ కుటుంబసభ్యులకు చెందిన సంస్థ బస్సులో యువతి అమై తల్లిపై లైంగిక వేధింపులు చోటుచేసుకున్న తరువాత.. రాష్ట్రంలో క్రమంగా మహిళలు, యువతులపై అత్యాచారాలు అధికమవుతున్నాయి. తాజాగా పంజాబ్ నగరం లుధియానాలో మరో దారుణం జరిగింది. ఇటీవల కిడ్నాప్నకు గురైన ఓ విద్యార్థిపై అగంతకులు అత్యాచారానికి పాల్పడటంతో పాటు చివరకు అమె ప్రాణాలను కూడా తీశారు. వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ లోని లూధియానాకు చెందిన విద్యార్థిని స్కూలు నుంచి ఇంటికి వస్తుండగా బుధవారం సాయంత్రం కిడ్నాప్నకు గురైంది. విద్యార్థినిని ఓ ఇంట్లోకి తీసుకెళ్లిన ఆగంతకులు బాలికపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు.
ఆ తరువాత రోజు సాయంత్రానికి బాలిక శవమై ఓ కాలువలో తేలింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించగా, అత్యాచారం జరిగినట్లు డాక్టర్లు నిర్ధారించారు. బాధిత బాలిక శరీరంపై సుమారు 17 గాయాలున్నట్లు వారు తెలిపారు. తలపై పెద్దగా గాట్లు కూడా ఉన్నాయని, బలమైన ఆయుధంతో నిందితులు ఆమెపై దాడి చేసి ఉండవచ్చని తెలుస్తోంది. బాధిత విద్యార్థిని బంధువులు, కుటుంబసభ్యులు తమకు న్యాయం చేయాలని మృతదేహంతో వారు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి, కేంద్రమంత్రికి చెందిన బస్సులో జరిగిన అఘాయిత్యంపై కేసు నమోదుకు వెనక్కు తగ్గిన పోలీసులు.. ఆ తరువాత ప్రజావ్యతిరేకత పెల్లుబిక్కడంతో గత్యంతరం లేని పరిస్థితిలో కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులోనైనా కనీసం నిందితులకు శిక్షపడేలా చేస్తారో..? లేదో..? వేచి చూడాలి మరి.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more