మొన్న బీహార్.. నిన్న ఏపి.. నేడు తెలంగాణ రాష్ట్రాలు ప్యాకేజీ జపం చేస్తున్నాయి. ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగుతోంది. ఎంతో కాలంగా బీహార్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ మీద ఎలాంటి నిర్ణయం తీసుకోని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ పేరుతో భారీగానే ప్యాకేజీ ప్రకటించింది. అయితే ఏపి రాష్ట్ర విభజన కారణంగా ఎంతో నష్టపోయిన నేపథ్యంలో ప్రత్యేక హోదా కల్పించాలని... కేంద్రం తరఫున భారీ ప్యాకేజీని ఆశిస్తు ఏపి సిఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రత్యేక ప్యాకేజీ మీద గలం విప్పారు. ప్రత్యేక ప్యాకేజీ కింద 30,571 కోట్లను రాష్ట్రానికి కేటాయించాలంటూ ఆయన కోరారు. ఈ మేరకు తాజాగా కేంద్రానికి లేఖ రాసినట్టు తెలిసింది.
నూతన రాష్ట్రమైన తెలంగాణకు 65 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించాలంటూ కెసిఆర్ కోరారు. ప్రతిగా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ...ఇంత పెద్ద మొత్తంలో కాకుండా నిధులను తగ్గించి ప్రతిపాదనలను పంపాలని సూచించింది. అదే విధంగా అన్ని పథకాలకు కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వాటికే తాము నిధులు కేటాయిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనల ప్రకారం మరోసారి ప్రతిపాదనలు తయారు చేయాలంటూ ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. అందుకనుగుణంగా వారు నివేదిక రూపొందించారు. నూతన ప్రతిపాదనల ప్రకారం...తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న మిషన్ కాకతీయ పథకానికి 10,216 కోట్లు, వాటర్ గ్రిడ్కు 20,355 కోట్ల సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more