నగరి ఎమ్మెల్యే రోజా మరోసారి చంద్రబాబు నాయుడు మీద ఏపి ప్రభుత్వం మీద మాటల తూటాలు పేల్చారు. అసెంబ్లీ సమావేశాల్లో జగన్ ను మాట్లాడనీయకుండా మైక్ కట్ చేస్తున్నారని చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని రోజా ప్రశ్నించారు. అయితే చంద్రబాబు నాయుడు మీద మాటల తూటాలు పేలుస్తూ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే మామూలుగా మాట్లాడితే ఏముంటుంది అని ఆలోచించారో ఏమో కానీ.. రోజా మాటల్లో చంద్రబాబు నాయుడు మీద వెటకారం బాగా కనిపించింది. సామెతలతో రోజా చంద్రబాబును విమర్శించిన తీరు డిఫరెంట్ గా అనిపించింది. వైసీపీ నాయకుల్లో ఎవరూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు. కానీ రోజా మేడం మాత్రం మీడియా ముందుకు వచ్చి పార్టీ తరఫున తన గళాన్ని వినిపించారు. రిషితేశ్వరి దగ్గరి నుండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా వరకు అన్నింటి మీదా ప్రభుత్వాన్ని నిలదీస్తామని రోజా వెల్లడించారు.
జగన్ కు అసెంబ్లీ కొత్త అని టీడీపీ నేత బోండా ఉమ అనడాన్ని ఆమె తప్పుబట్టారు. బోండా ఉమ ఏమైనా 10 సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారా? అని ప్రశ్నించారు. కేవలం మోదీపై ఉన్న క్రేజ్, పవన్ కల్యాణ్ పై ఉన్న అభిమానంతోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఈ రోజు పవన్ కు టీడీపీ భయపడాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. టీడీపీకి అంత సీన్ ఉంటే, ఎన్నికల సమయంలో ఓట్ల కోసం పవన్ ఇంటి ముందు పడిగాపులు ఎందుకు పడ్డారని అన్నారు. ఒక వైపు పుష్కర తొక్కిసలాటపై చర్చిద్దామంటూనే, మరోవైపు జగన్ ను మాట్లాడనీయకుండా చేస్తున్నారని మండిపడ్డారు.
ప్రత్యేక హోదా గురించి ప్రకటన చేస్తామని, మీరెందుకు తొందరపడుతున్నారని చంద్రబాబు అంటున్నారని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకోవడానికే బీజేపీ కాళ్ల వద్ద రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టుపెట్టారని విమర్శించారు. ఈ మధ్యనే 'కోడలు మగ బిడ్డను కంటానంటే, అత్త వద్దంటుందా?' అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కూడా రోజా తప్పుబట్టారు. మహిళలు అంటే చంద్రబాబుకు అంత చులకనా? అని మండిపడ్డారు. అమ్మణ్ణమ్మ లేకపోతే చంద్రబాబు పుట్టేవారా? భువనేశ్వరి లేకపోతే చంద్రబాబుకు లోకేష్ అనే వారసుడు ఉండేవాడా? అని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన సమయంలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ రోజా ఈ వ్యాఖ్యలు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more