ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ చేస్తే ఆత్మమత్యల పర్వానికి తెర లేచింది. మొన్నటికి మొన్న మునికోటి ఆత్మమత్య తెలుగు వారికి కన్నీటిని మిగిల్చింది. ఏపికి ప్రత్యేక హోదా కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని మునికోటి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా మరో మునికోటి ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని తప ప్రాణాలను బలివ్వడానికి సిద్దపడ్డారు.ప్రత్యేక హోదా రాదన్న మాట అశనిపాతం కావడంతో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సుందరపు దుర్గా ప్రసాద్ ఆత్మాహుతి యత్నం చేశారు. చిరు వ్యాపారి అయిన దుర్గాప్రసాద్ పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామానికి చెందిన వాడు. ప్రత్యేక హోదా రాదన్న నిరాశతో ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. 50 శాతం కాలిన గాయాలతో నినాదాలు చేసిన దుర్గా ప్రసాద్ ను మొదట తాడేపల్లి గూడెం ఏరియా ఆస్పత్రికి తర్వాత ఏలూరు, అక్కడినుంచి గుంటూరు జీజీహెచ్ కు తరలించారు.
కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి వచ్చిన దుర్గా ప్రసాద్ కైకరంలో చిన్నవ్యాపారం చేసుకుంటున్నాడు. ప్రత్యేక హోదా కోసం గతంలో చంద్రబాబుకు, జగన్ తణుకు దీక్షలూ వినతి పత్రాలు ఇచ్చాడు. గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న ఢిల్లీ పరిణామాలను టీవీలో చూస్తూ ప్రత్యేక హోదా, ప్యాకేజీ రాదని ముఖ్యమంత్రి ఒప్పుకున్నారని తెలిసి మనస్థాపానికి గురై ఆత్మహత్యా యత్నం చేశాడు. అతడి అరుపులతో భార్య జ్యోతి, కుమార్తెలు లేచి మంటల్లో దుర్గా ప్రసాద్ ను చూసి తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక హోదా వస్తే..కనీసం భవిష్యత్ తరాలు , తన బిడ్డల భవిష్యత్ బాగుంటుందని ఆశించానని దుర్గా ప్రసాద్ అన్నారు.ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తు ఇలా ఆత్మహత్యలకు పాల్పడటం సరికాదు. ప్రభుత్వాలు ఇలా మాట మార్చిన తీరు కూడా అస్సలు మంచిది కాదు. మరి తెలంగాణ ఉద్యమంలాగా ప్రత్యేక హోదా కోసం కూడా ఎంత మంది బలదానాలు ఇవ్వాల్సి వస్తుందో చూడాలి.
*Abhinavachary*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more