సామాన్య మధ్య తరగతి ప్రజల ఆశలనే పెట్టుబడిగా మార్చుకుని వారి కొత్త కలర్ టీవీల వాయిదా పద్దతుల్లో ఇస్తానని నమ్మబలికి మోసాలకు పాల్పడుతున్న లేడి కిలాడీ అంజలిపై మరో కేసు నమోదైంది. మైలార్గడ్డకు చెందిన అంజలి సులభ వాయిదాల పద్ధతిలో టీవీలు ఇప్పించి, ఆపై తప్పుడు ధృవపత్రాలు ఇచ్చావని సదరు వ్యక్తులను మోసం చేస్తూ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతుంది. అంతటితో అగకుండా.. మరోవైపు ఇతరులను ష్యూరిటీలుగా పెట్టి టీవీలు తీసుకుని, వాయిదాలను చెల్లించకుండా ఎగవేసి కేసుల ఊబిలో చిక్కకుంది. ఇప్పటికే ఈమె మోసాలపై స్థానికులు చిలకలగూడ సహా పలు పోలిస్ స్టేషన్లల్లో కేసులు నమోదు చేశారు. కాగా ఈమె భారిన పడిన మరో బాధితుడు చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేయగా అంజలిపై మరో కేసు నమోదు చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం.. తుకారాంగేట్ గంగపుత్రకాలనీకి చెందిన కె. సంజీవ్కుమార్(38) ప్రైవేటు ఉద్యోగి. కొద్దిరోజుల క్రితం స్నేహితుడు కిరణ్ ద్వారా అంజలితో పరిచయం ఏర్పడింది. అంజలి మేడంకు రెండు టీవీలు కావాలి, నీకు తెలిసిన షోరూంలో ఇప్పించమని కిరణ్ కోరడంతో రిలయన్స్ షోరూంలో జూన్ 6న, టీఎంటీ షోరూంలో అదే నెల 26న రూ.1,09,800 విలువ గల రెండు టీవీలు ఇప్పించాడు. వాయిదాలు చెల్లించకపోవడంతో ష్యూరిటీగా ఉన్న సంజీవ్కుమార్పై ఆయా సంస్థలు ఒత్తిడి తెచ్చాయి. అంజలిని వాయిదా డబ్బులు చెల్లించమని కోరితే తప్పించుకొని తిరుగుతోంది. ఈ క్రమంలో సంజీవ్కుమార్.. మైలార్గడ్డలోని అంజలి ఉంటున్న ఇంటికి వెళ్లి ఆరా తీయగా, ఆమె ఎప్పుడో ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయిందని చెప్పారు. సెల్ఫోన్ స్విచ్ఛాప్ చేసి ఉండటంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more