తప్పులెంచక ముందు తన తప్పులెరుగు మోదీ అంటూ ఆప్ కార్యకర్త తలంటుతున్నారు. అయినా మాట్లాడటానికి ఏకంగా 8.5 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. అయినా మోదీ గారు అంటేనే బిల్డప్ మరి అలాంటప్పుడు ఆ మాత్రం ఖర్చు ఉండదా అని మోదీ గారిని వెనకేసుకువచ్చే వారు కూడా ఉన్నారు. గత జులై చివరి ఆదివారం నాడు మోదీ నిర్వహించిన మన్ కీ బాత్ కోసం ప్రభుత్వం ఎంతో విసృతంగా ప్రచారం చేసింది. ఎంతలా ప్రచారం చేసిందంటే ప్రభుత్వం చేసిన ఖర్చు తెలిస్తే కళ్లు తిరేగేంతలా ఖర్చు చేసింది. అయినా అంత ఖర్చు చేసి ప్రచారం అవసరమా అని ప్రపతిపక్షాలు నెత్తినోరు కొట్టుకుంటున్నా మోదీ మాత్రం బెల్లంకొట్టిన రాయిగా మిన్నకుండిపోతున్నారు.
జులై 29న ప్రధాని మోదీ మన్ కీ బాత్ లో మాట్లాడారు. దేశంలో జరుగుతున్న రోడ్ల ప్రమాదాల మీద ఆందోళన వ్యక్తం చేశారు. త్వరలోనే తమ ప్రభుత్వం రోడ్డు భద్రత మీద కొత్త బిల్లును తీసుకువస్తుందని వెల్లడించారు. ఇదంతా బాగానే ఉంది.. కానీ మోదీ గారి మన్ కీ బాత్ ప్రచారం వెనక చేసిన ప్రచారం చూస్తేనే కళ్లుతేరేస్తున్నారు. ఓ ఆప్ కార్యకర్త ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ప్రచారం కోసం చేసిన ఖర్చు మీద సమాచార హక్కు చట్టం కింద వివరాలు సేకరించారు. అందులో ప్రభుత్వం చేసిన ఖర్చును చూసిన పిటిషనర్ అవాక్కయ్యారు. ఇంతకీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో తెలుసా..? 8,54,74,783రూపాయలు. అవును మీరు చదువుతున్నది అక్షరాల నిజం ఎనిమిది కోట్ల యాభైలనాలుగు లక్షలపైచిలుకు ఖర్చు చేశారు. అయితే ఢిల్లీలో ఆప్ ప్రచారం చేస్తున్న ఖర్చు మీద తీవ్రంగా మండిపడుతున్న బిజెపికి తమ ఖర్చు మాత్రం కనిపించడం లేదా అని ఆప్ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయినా మోదీనా మజాకా....
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more