ముసునూరు ఎమ్మార్వో వనజాక్షికి చంపేస్తామంటూ.. ఆగంతకుల నుంచి బెదిరింపు లేఖ అందిన నేపథ్యంలో సినీనటుడు, నందమూరి హరికృష్ణ అమెకు మద్దతుగా నిలిచారు. తన విధులను తాను సక్రమంగా నిర్వహిస్తున్న ఎమ్మార్వో వనజాక్షిని పది రోజులలోపు బదిలీ చేసుకుని వెళ్లిపోవాలని డిమాండ్ చేయడంతో పాటు.. అలా చేయిన పక్షంలో హతమారుస్తామంటూ ఆగంతకులు లేఖ రాయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వనజాక్షి పోరాటానికి అండగా తాను ఉంటానని, అమెను చంపుతామని బెదిరింపు లేఖ రాసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని హరికృష్ణ డిమాండ్ చేశారు.
అలాగే నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులోనూ.. అమె మరణానికి కారణమైన వారిపై ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టకూడదని ఆయన కోరారు. సీనియర్ల ర్యాగింగ్ ఉదంతం నేపథ్యంలో రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న ఘటన తనను కలిచివేషిందన్నారు. అధికారులకు రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వానిదని, ఇలాంటి చర్యలతో పార్టీకి, ప్రభుత్వానికి చెడు పేరు తీసుకురావడం కూడా మంచిది కాదని హరికృష్ణ అభిప్రాయపడ్డారు.
కాగా, తాను ముసునూరు వదిలి వెళ్లే ప్రసక్తే లేదని ఎమ్మారో వనజాక్షి స్పష్టం చేశారు. బెదిరింపులకు తాను లోంగనని, ఉద్యోగుల ప్రానాలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని అమె అన్నారు. అలాగే తన కుటుంబానికి హాని ఉన్నందన ప్రభుత్వమే తమ కుటుంబానికి భద్రత కల్పించాలని కోరారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకుంటున్న తమను ఆగంతకులు బెదిరింపులకు గురిచేస్తున్న క్రమంలో ప్రభుత్వ అధికారులు ఎలా విధులు నిర్వహిస్తారని అమె ప్రశ్నించారు. భయాంధోళతన మధ్య దినదిన గండంగా ఉద్యోగాలను నిర్వహించాలా..? అని ప్రశ్నించారు. ఈ తరహా బెదిరింపులకు తాను జడవనని వనజాక్షి తెలిపారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more