ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం భూసేకరణ సవరణ బిల్లు విషయంలో దిగరాక తప్పలేదు. 2013లో యూపీఏ ప్రభుత్వం చేసిన భూసేకరణ చట్టానికి తమ ప్రభుత్వం ప్రతిపాదించిన అన్ని సవరణలనూ ఉపసంహరించుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. భూమిపై రైతులకు హక్కులేకుండా చేస్తోందని భావిస్తున్న ఈ సవరణలను కాంగ్రెస్, వామపక్షాలు సహా అన్ని ప్రతిపక్ష పార్టీలూ వ్యతిరేకించటం తెలిసిందే. భూసేకరణ సవరణ బిల్లు ఇప్పటికి పలుమార్లు లోకసభ ఆమోదం పొందినా, రాజ్యసభ ఆమోదం తీసుకోవటంలో విఫలమవటంతో, ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేస్తూ వచ్చింది. ఎన్డీయే ప్రభుత్వం చివరకు భూసేకరణ సవరణ బిల్లుపై పార్లమెంటు సెలెక్ట్ కమిటీని వేసింది.ఈ కమిటీ ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వం ప్రతిపాదించిన అన్ని సవరణలనూ ఉపసంహరించుకోవాలనే సిఫారసు చేస్తున్నట్టు సమాచారం.
సెలెక్ట్ కమిటీ సిఫార్సులను దృష్టిలో పెట్టుకుని 2013 భూసేకరణ చట్టానికి తాము ప్రతిపాదించిన అన్ని సవరణలను ఉపసంహరించుకోవాలని ఎన్డీయే ప్రభుత్వం సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు. 2013 భూసేకరణ చట్టానికి సవరణలు చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఇస్తారని అంటున్నారు. వ్యాపారానికి అనుకూలంగా ఉండే భూసంస్కరణలను చేసే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేయాలని ఎన్డీయే ప్రభుత్వం ఇదివరకే ప్రతిపాదించటం తెలిసిందే. దేశంలో వౌలిక సదుపాయాలను త్వరితగతిన పెంచటంతోపాటు పెద్దఎత్తున పారిశ్రామిక ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు భూసేకరణ చట్టానికి మోదీ ప్రభుత్వం పలు సవరణలు ప్రతిపాదించటం తెలిసిందే. ఇప్పుడు వీటిని ఉపసంహరించుకోవాలనే నిర్ణయానికి రావటంతో 2013 భూసేకరణ చట్టం యథాతథంగా ఉండే అవకాశం ఉంది.
సంయుక్త పార్లమెంట్ కమిటీలోని 11మంది బిజెపి సభ్యులు సామాజిక ప్రభావ మదింపు అంశాన్ని, అలాగే భూములు తీసుకోవడానికి ముందు ఆయా రైతుల అంగీకారం తీసుకోవాలన్న నిబంధనను పునరుద్ధరించాలని నిర్ణయించారు. తాజాగా తుది నివేదిక ఇవ్వడానికి మరో నాలుగు రోజులపాటు తమకు గడువు కావాలని అహ్లూవాలియా సారథ్యంలోని ఈ పార్లమెంటరీ ప్యానెల్ కోరిన నేపథ్యంలో ఈనెల 7వ తేదీనాటికి భూసేకరణ బిల్లుపై ఏకాభిప్రాయ సిఫార్సులను పార్లమెంట్కు సమర్పించే అవకాశం కనిపిస్తోంది. ‘2003లో మేమెలాంటి చట్టాన్ని తీసుకొచ్చామో ఈ సవరణల ఉపసంహరణల వల్ల అలాంటి చట్టమే అమల్లోకి వస్తుంది. ఇది చాలా మంచి పరిణామం’ అని కమిటీలోని కాంగ్రెస్ సభ్యుడు ఒకరు వ్యాఖ్యానించారు. అధికార బిజెపి ప్రవేశపెట్టిన ఈ తాజా సవరణలతో తాము పూర్తిగా ఏకీభవిస్తున్నామని వెల్లడించారు. అయితే ఈ సవరణలను నేటి ఉదయమే సభ్యులకు పంపిణీ చేశారని, వాటిని అధ్యయనం చేసే సమయమే తమకు లేకుండా పోయిందంటూ తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు డెరక్ ఓబ్రియాన్, కళ్యాణ్ బెనర్జీలు సమవేశం నుంచి వాకౌట్ చేశారు. మొత్తం ఆరు సవరణలపై నేటి కమిటీలో చర్చ జరిగింది. అన్నింటిపైనా సభ్యులమధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మొత్తం 15 సవరణల్లో తొమ్మిది అత్యంత తీవ్రమైన ప్రభావాన్ని కలిగి ఉండటం వల్ల కాంగ్రెస్తోపాటు ఇతర ప్రతిపక్ష పార్టీలూ వాటిని వ్యతిరేకించాయి. ఈ తొమ్మిందిటిలో ఆరు సవరణలపై నేటి సమావేశంలో చర్చ జరిగిందని, వాటిపై ఏకాభిప్రాయం కుదిరిందని కాంగ్రెస్ సభ్యులు వెల్లడించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more