ముంబైలో 1993 పేలుళ్ల ప్రధాన నిందితుల్లో ఒకడైన టైగర్ మెమన్... ఆ తరువాత మరో భారీ విధ్వంసానికి కుట్ర పన్నినట్లు తెలిసింది. ముంబై ఘర్షణలకు ప్రతీకారంగా ఏకంగా సహర్ ఎయిర్పోర్టులో విమానాన్ని పేల్చివేయాలని నిర్ణయించడన్న విషయం తెలిసింది.. తద్వారా దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో భారీ భయాందోళనలు సృష్టించాలని కుట్ర పన్నినట్లు పోలీసుల విచారణలో తేలింది. 1993 వరుస పేలుళ్ల కేసులోని నిందితుడైన నాసిర్ అబ్దుల్ కాదర్ కెవాల్ ను విచారించిన పోలీసులకు ఆయన ఈ భయానక విషయానలు తెలిపాడు.
ఇందుకోసం ఏకంగా ఒక ప్రత్యేక బృందాన్ని కూడా టైగర్ మెమెన్ ఏర్పాటు చేసినట్లు నాసిర్ తెలిపాడు. అందులో టైగర్ కూడా సభ్యుడిగా ఉన్నాడని వివరించాడు. విమానాశ్రయంలో రన్వేకు దూరంగా ఒక కారులో ఉండాలని, విమానం దగ్గరగా వచ్చినప్పుడు అదును చూసుకుని పేల్చివేయాలన్నది అతడి ప్రణాళిక. ఈ ఘటనలో భారీనష్టం జరక్కపోయినా... కనీసం దాని రెక్క వరకూ దెబ్బతిన్నా... భయాందోళనలు సృష్టించాలన్న అతడి కోరిక నెరవేరుతుందని భావించాడు. కానీ, ఈ ప్రణాళికను అమలు చేయకుండా తర్వాత వెనక్కు తగ్గారు.
ఈ కుట్రకు సంబంధించిన వివరాలను మెయిల్ టుడే పత్రిక ప్రత్యేకంగా సేకరించింది. దీంతోపాటు, 1994లో టైగర్ మెమన్ కరాచీలో ఉన్నట్లుగా తెలియచేసే ఆధారాలను కూడా ఈ పత్రిక సంపాదించింది. అక్కడి యాకూబ్ మెమన్ ఇంట్లో సహచరులతో టైగర్ సంభాషణలకు సంబంధించిన ఆధారాలనూ ఈ పత్రిక సేకరించింది. ఆ సందర్భం గా ఐఎ్సఐను ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఏజెన్సీగా టైగర్ ప్రస్తావించా డు. ఈ సంభాషణలను సీబీఐకి యాకూబ్ మెమన్ తెలియచేసి తా ను అమాయకుడినని పేర్కొన్నట్లు కూడా మెయిల్ టుడే పేర్కొంది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more