ఏ రాష్ట్రంలో అయినా హోంశాఖ అనగానే ముఖ్యమంత్రి తరువాత అంతటి విలువైన పదవిగా గుర్తింపు వుంది.. దీంతో ఆ పదవిని అందుకోవాలని కలలు కనే వారి సంఖ్య కూడా అధికంగానే వుంది. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రిలాంటి ఎన్ని శాఖలున్నా.. హోంశాఖకే ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఆ శాఖకు మంత్రిగా ఉన్న నిమ్మకాయల చినరాజప్ప మాత్రం ఈ హోంశాఖ నాకొద్దు బాబుగారూ.. అంటూ చంద్రబాబుకు మొరపెట్టుకుంటున్నారట. అంతేకాదు తన పదవికి కూడా రాజీనామా చేసి.. సీఎం చంద్రబాబుకు అందించారు. ఆయన హోం శాఖను ఎందుకు వద్దనుకుంటున్నారు?
పోలీసుల తీరుపై చినరాజప్ప చాలా అసంతృప్తితో ఉన్నారు. వరుస సంఘటనలు ఆయనను నిరాశకు గురి చేశాయట. ఆ అసంతృప్తి ఏ స్థాయిలో ఉందంటే ఆ హోంశాఖే తనకొద్దనే స్థాయిలో ఉందట. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రిలో తొక్కిసలాట జరగడం, ఓటుకు నోటు వ్యవహారంలో ఇంటెలిజెన్స్ వైఫల్యంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. చినరాజప్ప చాలా రోజులుగా తన శాఖలో సమీక్ష సమావేశాలు నిర్వహించడం మానేశారు. పోలీసు శాఖలో కొత్తగా ఒక్క సంస్కరణ కూడా ఆయన చేపట్టలేకపోయారు.
‘పుష్కరాల తొలిరోజే తొక్కిసలాట ఘటన జరిగిన తర్వాత హోం శాఖను చూస్తున్న డిప్యూటీ సీఎం రాజప్ప.. సంఘటనకు బాధ్యత తీసుకొని తాను రాజీనామా చేస్తానన్నారు. చంద్రబాబు ఆయనను వారించినట్లు సమాచారం. ఏదైనా సంఘటన జరిగితే దానిని సమర్థవంతంగా ఎదుర్కుని సత్తా చాటాలని అంతేకాని, రాజీనామా చేయడంతో ఘటన సమసిపోదని ఆయన రాజప్పకు సూచించినట్లు తెలుస్తోంది. పుష్కరాల తోక్కిసలాట ఘటనకు బాధ్యత తనదిగా చంద్రబాబు చెప్పారని, ఇప్పటికే ఈ అంశమై ప్రజలకు కూడా వివరణ ఇచ్చానని, ఇక రాజీనామా ఆలోచనను మానుకుని శాఖలో సమీక్షలు నిర్వహించి.. అలర్ట్ నెస్ గా వుండేల్లు చూడాలని చంద్రబాబు రాజప్పకు హితబోధ చేసినట్లు తెలుస్తోంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more