అబ్దుల్ కలాం.. ఇది పేరు కాదు. భారతదేశం గర్వించదగిన ఓ మహోన్నత వ్యక్తి. భారత గడ్డ మీద పుట్టిన మేరుశిఖరం. అలాంటి మహా వ్యక్తి నేల విడిచి నింగికెగిరారు.. భారత కీర్తి ప్రతిష్టలను ఆకాశపుటంచుల దాకా ఎగరవేసిన మహా మనిషి ఇక సెలవంటూ తిరిగిరాని లోకాలకు ప్రయాణమయ్యారు. భారతదేశ ప్రజలు ఎంతో బాధాతప్త హృదయంతో కలాంకు కన్నీటి వీడ్కోలు పలికింది. అయితే అబ్దుల్ కలాం మృతి వార్త తలుసుకున్న అందరు కన్నీళ్లు పెట్టుకున్నారు. సగటు భారతీయుడు బాధ పడ్డ విషాద వార్తను గుండె లోతుల్లో అదుముకున్నారు. అయితే ఈ వార్త విన్న ఓ చిన్నారి మాత్రం తిండి తినడంలేదు. కలాం మృతి వార్త విన్న దగ్గరి నుండి ఏడుస్తూనే ఉన్నాడు. ఇంతకీ ఎవరా చిన్నారి... ఎందుకు అంతలా బాధపడుతున్నారు అనే విషయాలు తెలియాలంటే. ఈ స్టోరీ చదవాల్సిందే.
ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓంప్రకాశ్ వర్మ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. అతనికి ఆకాశ్ ఒకే ఒక్క కొడుకు. అయితే ఆకాశ్ కు 2009లో లివర్ సిర్రోసిస్ తో ఆస్పత్రిలో చేరారు. అయితే ఆర్మీ రిసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్ లో చేరిన ఆకాశ్ కు సర్జరీ చెయ్యడానికి డాక్టర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే లివర్ కు సంబందించిన సర్జరీ కాబట్టి కాస్త టెన్షన్ వాతావరణం నెలకొంది. సరే ఆకాశ్ దగ్గరికి వెళ్లి నీకేమైనా కోరికలు ఉన్నాయా అని అడిగితే.. ఆకాశ్ తడుముకోకుండా వెంటనే అబ్దుల్ కలాంగారిని కలవాలి అని చెప్పేశాడు. సరే చిన్నారి అడుగుతున్నారు కదా అని అబ్దుల్ కలాంకు మెయిల్ పెట్టారు. ఆకాశ్ పరిస్థితి గురించి అందులో పూర్తిగా రాసారు.
ఆకాశ్ పరిస్థితి తెలుసుకున్న అబ్దుల్ కలాం ఆస్పత్రికి వచ్చి పలకరించారు. ఆకాశ్ కు పట్టలేనంత ఆనందం.. కలలో కూడా ఊహించని సర్ ప్రైజ్. అబ్దుల్ కలాం గెట్ వెల్ సూన్ అంటూ బుకే కూడా తీసుకువచ్చారు. చాలా సేపటవి వరకు ఆకాశ్ తో ముచ్చటించిన అబ్దుల్ కలాం జ్ఞాపకాలను నేటికీ మరిచిపోలేదు. అయితే తాజాగా అబ్దుల్ కలాం మరణ వార్త విని ఆకాశ్ తల్లడిల్లిపోయారు. కలాం మృతి వార్త విన్నప్పటి నుంచి ఆకాశ్ తిండి మానేశారు.. కలాం జ్ఙాపకాలను తలుకుంటూ కుమిలిపోతున్నాడు. ఓ రాష్ట్రపతి హోదాలో ఉన్న వ్యక్తి, గొప్ప మేధావి అయినా కలాం ఇక ఎన్నటీకి తిరిగి రారు అని తెలుసుకొని కన్నీరు పెడుతున్నారు. ఆకాశ్ ను చూడడానికి కలాం ఇక ఎన్నటికీ రారు కానీ అతని నవ్వులో అతడు భవిష్యత్ లో చేసే ప్రతి మంచి పనిలో కలాం కనిపిస్తూనే ఉంటారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more