Nifty ends July F&O series at 8422, Sensex firm; FMCG zooms

Sensex gains 142 points nifty above 8 422

RBI repo rate unchanged, Reserve Bank of India, RBI key policy rate unchanged, Federal Reserve, fiscal consolidation, GDP growth, R&B, Raghuram Rajan, RBI, RBI rate cut, Repo rate, RBI governer raghuram rajan, Reserve Bank of India monetary policy, Reporate, Reverse Repo Rate, CRR SLR MSF, Today sensex, today nifty, Infosys, Indian rupee, currency, dollar, BHEL, Titan, Tata Motors, Punjab National Bank, ICICI bank, Hindustan Unilever, Hero MotoCorp, International prices, American central bank interest rates, Gold price

The Nifty closed July series below the 8450 level. The 50-share index was at 8421.80, up 46.75 points or 0.6 percent. The Sensex gained 141.92 points or 0.5 percent at 27705.35.

జులై సిరీస్ లో వెనుకబడ్డ సెస్సెక్స్.. స్వల్ప వృద్ధి సాధించిన నిఫ్టీ

Posted: 07/30/2015 05:43 PM IST
Sensex gains 142 points nifty above 8 422

వరుసగా రెండో రోజు స్టాక్ మార్కట్లకు లాభాల్లో పయనించాయి. స్టాక్ మార్కట్లు బ్లెడ్ బాత్ ను చవిచూసిన అనంతరం మెల్లిగా కోలుకున్న మార్కెట్లు నిన్న లాభాలను ఆర్జించగా, ఇవాళ అంతకన్న అధికంగా లాభాలను అర్జించాయి. విదేశాల నుంచి వచ్చిన సానుకూల పవనాలకు తోడు అమెరికా వృద్ధిరేటు పుంజుకుంటోందన్న వార్తల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్లో కొనుగోళ్ల జోరు పెరిగింది. ఆసియా మార్కెట్ ను చైనా అర్థిక సంక్షోభం కుదిపేస్తున్నా.. ఆ ప్రభావం మాత్రం దేశీయ సూచీలపై కనబడలేదు. అమెరికా ఫెడ్ రిజర్వు సానుకూల నిర్ణయాలను తీసుకుంటుందన్న ఊహాగానాల నేపథ్యంలో సూచీలు లాభాల భాట పట్టాయి. .

 అయితే జూలై సిరీస్ లో మాత్రం సెన్సెక్స్ నష్టాల్లోనే ట్రేడింగ్ ముగించింది. అటు నిఫ్టీ మాత్రం స్వల్ప లాభాలను ఆర్జించింది. జూలై సిరీస్ లో సెన్సెక్స్ 0.7 శాతం నష్టాన్ని చవిచూడగా, ఎఫ్ఎంజీసీ, ఐటీ సంబంధించి సూచీలు మాత్రం లాభాలను ఆర్జించాయి. ఎఫ్ఎంజీసీ 4.7 శాతం వృద్దిని సాధించగా, ఐటీ సెక్టార్ మాత్రం 3.3 శాతం వృద్దిని సాధించింది. ఈ సిరీస్ లో లోహానికి సంబంధించిన సూచీలు మాత్రం 9 శాతంతో వెనకంజలో నిలిచాయి. అధిక విస్తారం కలిగిన మధ్యతరహా, చిన్న తరహా పరిశ్రమల సూచీలు కూడా ఈ సిరీస్ లో లాభాలను గడించాయి. మధ్యతరహా 4, చిన్న తరహా పరిశ్రమ సూచీలు 5 శాతం వృద్దిని నమోదు చేసుకున్నాయి.
 
కాగా ఇవాళ ఉదయం ప్రారంభంతోనే స్టాక్ మార్కెట్లు భారీ లాభాలను నమోదు చేసకున్నాయి. సెన్సెక్స్ 199 పాయింట్ల లాభాన్ని అర్జించగా, అటు నిష్టీ కూడా 58 పాయింట్ల లాభాన్ని అర్జించింది. అయితే ఆ లాభాలను అదిమి పట్టుకోవడంలో మార్కెట్లు విఫలమయ్యాయి. అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ఎలాంటి నిర్ణయాలను వెలువరిస్తుందోనన్న నేపథ్యంలో మార్కెట్లు ఒడిదోడుకులకు గురైయ్యాయి. కాగా చివరికి మాత్రం లాభాలనే ఆర్జించాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 142 పాయింట్ల లాభంతో 27 వేల 705 పాయింట్ల వద్ద ముగియగా, నిప్టీ కూడా 47 పాయింట్ల లాభంతో 8422 పాయింట్ల వద్ద ముగిసింది.

ఈ క్రమంలో క్యాపిటల్ గూడ్స్, ఐటీ, టెక్నాలజీ, లోహానికి  సంబంధించిన రంగాలు నష్టాలను చవిచూడగా, ఎఫ్ ఎం జీ సీ, బ్యాంకింగ్, హెల్త్ కేర్, మధ్య తరహా, చిన్న తరహా పరిశ్రమక రంగాలకు చెందిన సూచీలు భారీ లాభాలను ఆర్జించగా, అటో, కన్జూమర్ డ్యూరబుల్స్, అయిల్ అండ్ గ్యాస్, పబ్లిక్ సెక్డార్ యూనిట్స్ స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఈ తరుణంలో బ్యాంక్ అఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, డాక్డర్ రెడ్డీస్ ల్యాబ్స్, సిప్లా, ఐటీసీ, తదితర సంస్థల షేర్లు లాభాలను గడించగా, ఎన్ఎండీసీ, సన్ ఫార్మ, హిండాల్కో, ఇన్పోసిస్, కోటక్ మహింద్రా తదితర సంస్థల షేర్లు నష్టాలను మూటగట్టుకున్నాయి

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Business  Markets  BSE Sensex  Nifty  Market  Infosys  indian rupee  

Other Articles