కేంద్ర మంత్రి సజనా చౌదరికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు చెందిన యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సంస్థ వేసిన పిటీషన్ ఉమ్మడి హైకోర్టులో తిరస్కరణకు గురైంది. తమకు వ్యతిరేకంగా సింగిల్ జడ్జి న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును కోట్టివేయాలని కోరుతూ సుజనా ఇండస్ట్రీస్ దాఖలు చేసిన కంపెనీ అప్పీల్ ను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. అదే సమయంలో సుజనా ఇండస్ట్రీస్ మూసివేత కోసం మారిషస్ కమర్షియల్ బ్యాంక్ ఆరు నెలల పాటు పత్రికా ప్రకటన రూపంలో ఇవ్వద్దన్న సింగిల్ జడ్జి అదేశాన్ని సవాలు చేస్తూ సదరు బ్యాంక్ దాఖలు చేసిన పిటీషన్ ను ధర్మాసనం అనుమతించింది. ఈ విషయంలో సింగిల్ జడ్జి అదేశాన్ని కోద్దిగా సవరించింది. ప్రతికా ప్రకటన ఇచ్చే కాల వ్యవధిని ఆరు నెలల నుంచి ఐదు నెలలకు కుదించింది.
ఈ ఏడాది సెప్టెబర్ 30 నాటికి ఉన్న బకాయిలను సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చెల్లించకపోతే, ఆ వెంటనే కంపెనీ పిటీషన్ విచారణకు స్వీకరించిన విషయాన్ని ప్రతికా ప్రకటన ద్వారా తెలియచేయవచ్చునని ఎంసీబికి స్పష్టం చేసింది. ఈ మేరకు ద్విసభ్య బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ ఎస్. రవికుమార్లతో కూడాన ధర్మాసనం తీర్పును వెలువరించింది. హిస్టీయా పేరుతో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ తమ అనుబంధ కంపెనినీన మారిషస్ లో ఏర్పాటు చేసి, మారిషస్ కమర్షియల్ బ్యాంకు నుంచి 100 కోట్ల రూపాయల మేర రుణం తీసుకుంది. ఈ లావాదేవీల్లో సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ హామీదారుగా వుంది. బకాయిలను చెల్లించడంలో హిస్టియా కంపెనీ విఫలం కావడంతో గ్యారెంటర్ గా వున్న సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ పై ఎంసీడి ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించగా, సింగల్ జడ్జి తీర్పును వెలువరించారు. దీనిని సవాల్ చేస్తూ ద్విసభ్య బెంచ్ కు వెళ్లిన సుజనా సంస్థకు అక్కడ కూడా ఎదురుదెబ్బ తగిలింది.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more