రంగుల ప్రపంచంగా పిలువబడే సినీ ఇండస్ట్రీలో ఓ దారుణం చోటు చేసుకుంది. విశ్రాంతి తీసుకుంటున్న హీరో-హీరోయిన్లపై ఓ దర్శకుడు యాసిడ్ దాడి చేసి, అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ దాడిలో గాయపడిన ఆ నటీనటులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే.. నటి పరిస్థితి కాస్త విషమంగా వుందని వైద్యులు తెలిపారు. ఈ మొత్తం తతంగం జరిగింది భోజ్ పురి సినీ పరిశ్రమలో!
వివరాల్లోకి వెళ్తే.. రూపాలి (20), వికాస్ (19) అనే ఇద్దరు నటీనటులు ఓ సినిమా షూటింగ్ నేపథ్యంలో చిత్రీకరణ జరుగుతున్న స్పాట్ కి చేరుకున్నారు. అక్కడే వున్న ఓ కాలేజ్ ప్రాంగణంలో వీరిద్దరు విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లారు. ఈ క్రమంలోనే వారిద్దరూ నిద్రలోకి జారిపోగా.. ఇదే అదును అని భావించిన అజయ్ కుమార్ అనే సినీ డైరెక్టర్ వారిపై యాసిడ్ దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దాడిలో ఆ నటీనటులు తీవ్రంగా గాయపడగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే.. రూపాలి పరిస్థితి విషమంగా వున్నట్లు తెలుస్తోంది. ఆ డైరెక్టర్ ఈ దాడికి ఎందుకు పాల్పడ్డాడన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేయగా.. అసలు విషయం బయటపడింది.
నటి రూపాలిని దర్శకుడు అజయ్ ప్రేమిస్తున్నట్లుగా తెలిసింది. అయితే.. తన ఇష్టానికి వ్యతిరేకంగా నటుడు వికాస్ తో కలిసి నటించేందుకు ఆమె అంగీకరించడంతో, అజయ్ కోపంతో ఈ యాసిడ్ దాడి చేశాడని చెబుతున్నారు. ప్రస్తుతం పరారీలో వున్న అజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర సమాచారం ఇంకా తెలియాల్సి వుంది.
AS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more